పండగ అంటేనే సినిమా.. సినిమా అంటేనే పండగ. ముఖ్యంగా ఇండియన్ సినిమా లవర్స్ కు ఏ ఫెస్టివల్ వచ్చిన సరే సినిమా ఉండాల్సిందే. ఇక ఈ ఏడాది ఉగాది మరియు ఈద్ కానుకగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మోహన్ లాల్, సల్మాన్ ఖాన్, విక్రమ్, నితిన్ వంటి హీరోల సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యాయి. భారీ ఎత్తున రిలీజ్ అయిన రిలీజ్ అయిన ఈ సినిమాలు ఏప్రిల్ 6 వరకు రాబట్టిన కలెక్షన్స్ ఫైనల్ రిజల్ట్.. ఓ సారి తెలుసుకుందాం..
ఎంపురాన్ : మోహన్ లాల్, పృద్వి రాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి మిక్డ్స్ టాక్ తెచ్చుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా రూ. 253 కోట్లు కలెక్ట్ చేసి కేరళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మిగిలిన ఇండస్ట్రీలలో ఈ సినిమా ప్లాప్ గా నిలిచింది.
సికిందర్ : సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ స్టార్ దర్శకుడు మురుగదాస్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఈద్ కానుకగా 30న రిలీజ్ అయింది. మొదటి షో నుండి ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.156 కోట్లు రాబట్టి డిజాస్టర్ గా నిలిచింది. నార్త్ లో ఓ మాదిరి కలెక్షన్స్ రాగా సౌత్ లో వైట్ వాష్ అయింది.
వీర ధీర సూరన్ : విక్రమ్ నటించిన ఈ సినిమా మార్చి 27న ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాని కారణంగా ఉదయం ఆటలు క్యాన్సిల్ అయి సాయంత్రం ఆటతో విడుదలయింది. రీసెంట్ తమిళ్ బెస్ట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రూ. 62 కోట్లు గ్రాస్ రాబట్టి బిలో యావరేజ్ గా నిలిచింది.
రాబిన్ హుడ్ : నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా గతనెల 27న రిలీజ్ కాగా మార్నింగ్ షో నుండి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దాదాపు రూ. 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.12.5 రాబట్టి భారీ డిజాస్టర్ గా అయింది. నితిన్ ప్లాపుల పరంపరను కొనసాగించింది.
మ్యాడ్ స్క్వేర్ : మ్యాడ్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా మిక్డ్స్ టాక్ తెచ్చుకున్న కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 67 కోట్లు రాబట్టి బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.