Minister Sridhar Babu: అక్కడ 200 ఎకరాల్లో ఏఐ సిటీ.. కీలక విషయాలు బయటపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. పాడ్కాస్ట్ విత్ ఎన్టీవీ తెలుగు (Podcast With NTV Telugu)లో ఆయన ప్రభుత్వ విధానాలను వివరించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనాలిటిక్స్ వంటి కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. మంత్రి వివరణ ఆయన మాటల్లోనే.. రాబోయే కాలంలో క్వాంటం కంప్యూటింగ్ కి సంబంధించిన అంశాలు కూడా దృష్టిలో పెట్టుకుని రెండో స్థానం నుంచి మొదటి స్థానానికి రావడానికి ముందుగా ఆలోచించి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించేందుకు కృషి చేస్తున్నాం. ఐటీలో మనం మొదటి రాష్ట్రంగా ఎదగడానికి ఆస్కారం ఉంది. రాబోయే కాలంలో హైదరాబాద్ను ఏఐ గ్లోబల్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇంటర్ నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రముఖులు, దిగ్గజాలను పిలిచి వారి అభిప్రాయాలను తీసుకుంటున్నాం. వారి అనుభవాలను స్వీకరించి ఏఐ సిటీని నిర్మాణం చేయాలని ఆలోచన చేసి 200 ఎకరాల స్థలంలో ఏఐ సిటీని నిర్మాణం చేయబోతున్నాం.
READ MORE: Crime News: మూడే రోజులు.. ఇంటి ఓనర్ను చంపేసిన పని మనీషి!
Also Read
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
- Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
- Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
- Chennai Love Story :రివ్యూయర్స్ ను తిట్టకుండా.. మాట విన్నారు, హిట్టు కొట్టారు!
ఈ విధంగా ఒకటి తరువాత ఒకటి కొత్త టెక్నాలజీస్పై మనమే ముందుగా మన దగ్గర ఉన్నా 3 లక్షల మంది ఐటీ రంగ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలను కుంటున్నాం. ఏఐ స్కిల్ ఇక్కడే దొరికేలా చేయాలని ట్రై చేస్తున్నాం. ప్రపంచ స్థాయిలో మనమే ఆదర్శంగా ఉంటూ ఏఐ ప్రోడక్ట్స్ రావడానికి, సర్వీసెస్లో కూడా మొదటి స్థానంలో ఉండటానికి ప్రణాళికలు చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు ఉద్యోగాలు, పరిశ్రమలు, స్కూల్స్, ప్రైవేట్ రంగం ఇలా అన్నింటిలో ఏఐ విస్తరణ జరుగుతోంది. ప్రభుత్వం రంగంలో కూడా ఏఐని ఉపయోగించుకుని ముందుకు వెళితే ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ పెరుగుతుంది. పౌరులకు కూడా సేవలు తొందరగా, క్వాలిటీగా అందించడానికి అవకాశం ఉంటుందని ఓ ప్రయత్నం చేస్తున్నాం. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయి. కానీ.. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా స్కిల్స్ నేర్చుకుంటే కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయి. అందుకే స్కిల్ యూనివర్సిటీ పెట్టి కొత్త వారికి శిక్షణతో పాటు ప్రస్తుతం పని చేస్తున్న వాళ్ల నైపుణ్యాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్ర శ్రీధర్ బాబు వెల్లడించారు.
READ MORE: Crime News: మూడే రోజులు.. ఇంటి ఓనర్ను చంపేసిన పని మనీషి!
తాజావార్తలు
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
-
PM Modi: “మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే…” మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!