Rahul Gandhi: రాజీవ్ గాంధీపై ‘చనిపోయిన వ్యక్తి’ పోటీ చేశారు.. రాహుల్గాంధీకి ఈ కథ తెలియదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలో చనిపోయినట్లు ప్రకటించిన కొంతమంది వ్యక్తులను కలిసిన విషయం తెలిసిందే. బీహార్ నుంచి వీరిని ఢిల్లీకి పిలిపించి వారితో కలిసి టీ తాగారు. అనంతరం రాహుల్ గాంధీ సోషల్ సైట్ ఎక్స్లో ఒక వీడియోను కూడా షేర్ చేశారు. ఎన్నికల కమిషన్ పనితీరుపై వ్యంగ్యంగా స్పందించారు. “నాకు జీవితంలో చాలా ఆసక్తికరమైన అనుభవాలు ఎదురయ్యాయి.. కానీ ‘చనిపోయిన వ్యక్తులతో’ టీ తాగే అవకాశం ఎప్పుడూ రాలేదు… ఈ ప్రత్యేకమైన అనుభవానికి కారణమైన ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు!” అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు. రాహుల్ గాంధీని కలిసిన వారు బీహార్లోని రఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్. కానీ.. రాహుల్గాంధీకి ఓ కథ తెలియదు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
READ MORE: UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు షాక్.. త్వరలో ఆ సేవలు బంద్!
Also Read
- Tollywood: ఫేక్ హౌస్ఫుల్స్... డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త "మైండ్ గేమ్"!
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
- Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
- Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
1972లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అజంగఢ్ నివాసి అయిన లాల్ బిహారీని ప్రభుత్వ పత్రాల్లో చనిపోయినట్లు ప్రకటించారు. ఆస్తిపై దురాశతో లాల్ బిహారీ కుటుంబ సభ్యులు తహసీల్దార్ సహకారంతో లాల్ బిహారీని చనిపోయినట్లు ప్రకటించారని చెబుతారు. బతికి ఉండగానే ఇతడి భూమిని కూడా ఆక్రమించుకున్నారు. 22 సంవత్సరాల పోరాటం తర్వాత, లాల్ బిహారీకి చివరకు 1994లో న్యాయం లభించింది. కోర్టు ఆదేశాల మేరకు, స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని పత్రాలను సరిదిద్ది లాల్ బిహారీ బతికే ఉన్నట్లు ప్రకటించారు. కోర్టు విచారణల సమయంలో తనను ‘లాల్ బిహారీ మృతక్ హాజిర్ హో’ అని పిలిచేవారని, అందుకే లాల్ బిహారీ తన పేరు ముందు మృతక్ అనే పదాన్ని కూడా చేర్చుకున్నారని ఆయన గతంలో చెప్పారు. తన పోరాట సమయంలో తనలాంటి వారిని ఏకం చేసి మృతక్ సంఘ్ను ఏర్పాటు కూడా చేశారు. గత 50 సంవత్సరాలుగా బతికి ఉన్నా చనిపోయినట్లు ప్రకటించిన వారి కోసం ఈ సంఘం కృషి చేస్తోంది.
READ MORE: President Murmu speech: రాజ్యాంగం.. ఆపరేషన్ సింధూర్పై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి లాల్ బిహారీ 1989లో రాహుల్ గాంధీ తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ఎన్నికల్లో పోటీ చేశారు. అంతకు ముందు, మరొక మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్పై కూడా పోటీ చేశారు. లాల్ బిహారీ 2024లో ప్రధాని నరేంద్ర మోడీపై ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. లాల్ బిహారీ పోరాటంపై బాలీవుడ్ చిత్రం ‘కాగజ్’ చిత్రాన్ని కూడా నిర్మించారు. నటుడు పంకజ్ త్రిపాఠి ‘కాగజ్’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.
READ MORE:Allu Aravind: ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.. బడా నిర్మాత సంచలన కామెంట్స్!
వాస్తవానికి.. బాధితుడు తను బతికే ఉన్నానని నిరోపించుకోవడానికి కోర్టులో చాలా కష్టపడ్డారు. అప్పట్లో దేశం, యూపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండింది. విశేషం ఏంటంటే.. లాల్ బిహారీ ఇప్పటికీ బతికే ఉన్నారు. కానీ.. రాహుల్ గాంధీ, రాజీవ్గాంధీకి లాల్ బిహారీతో టీ తాగాలని పించలేదు. వాళ్ల హయాంలో చేసిన తప్పు బట్టబయలు అవుతుందని బతికి ఉన్నా చనిపోయాడని ప్రకటించిన లాల్ బిహారీతో టీ తాగే ప్రయత్నం చేయలేదు. రాజీవ్ గాంధీపై ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఆయనను పట్టించుకోలేదు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!