President Murmu speech: రాజ్యాంగం.. ఆపరేషన్ సింధూర్పై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Murmu speech: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ముర్ము మాట్లాడుతూ.. ఆగస్టు 15 కేవలం స్వేచ్ఛా పండుగ మాత్రమే కాదని, ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కంటే గొప్పది ఏదీ లేదని అన్నారు. ప్రజాస్వామ్య మార్గంలో సవాళ్లు ఎదురైనప్పటికీ భారతదేశం విజయం సాధించిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల వల్లే 78 సంవత్సరాల క్రితం దేశానికి స్వేచ్ఛ వచ్చిందని అన్నారు.
READ MORE: UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు షాక్.. త్వరలో ఆ సేవలు బంద్!
Also Read
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
- Harish Rao: "నీకు మా రక్తం కావాలా".. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
- Vaibhav Sooryavanshi: "టాస్ వేసేదాకా చెప్పలేదు".. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
- ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్ను కోల్పోయిన భారత్!
ఆపరేషన్ సింధూర్ గురించి..
రాష్ట్రపతి ముర్ము ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఉగ్రవాదంపై మానవాళి పోరాటానికి ఉదాహరణగా ఆపరేషన్ సింధూర్ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. పహల్గాం దాడికి భారతదేశం తీసుకున్న నిర్ణయాత్మక, దృఢమైన ప్రతిస్పందన ఇదని, దీనితో మన సాయుధ దళాలు దేశాన్ని రక్షించడానికి ఏ పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని నిరూపించిందన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, ప్రతి వయోజన పౌరుడికి ఓటు హక్కు ప్రసాదించిన ప్రజాస్వామ్య మార్గాన్ని మనం స్వీకరించామని గుర్తు చేశారు. దీని ద్వారా మన విధిని నిర్ణయించుకునే హక్కును మనమే ఇచ్చుకున్నామని అన్నారు. సవాళ్లు ఉన్నప్పటికీ, భారత ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విజయవంతంగా స్వీకరించారని, మనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అన్నింటికంటే ముఖ్యమైనవి అన్నారు.
ఆగస్టు 15 దేశ ప్రజల సమిష్టి జ్ఞాపకాలలో నిలిచిపోయే చారిత్రాత్మక తేదీ అని ఆమె పేర్కొన్నారు. సుదీర్ఘ వలస పాలనలో భారతీయులు తరతరాలుగా స్వేచ్ఛ గురించి కలలు కన్నారని అన్నారు. దేశంలోని ప్రతి మూల నుంచి ప్రజలందరూ విదేశీ పాలన సంకెళ్లను తెంచుకోవాలని శాంతియుత మార్గంలో పోరాడారని తెలిపారు. వారి పోరాటం అచంచలమైన ఆశావాదంతో నిండి ఉంది. ఇది స్వాతంత్ర్యం తర్వాత కూడా మన అభివృద్ధిని నడిపించిందని అన్నారు. రేపు మనం త్రివర్ణ పతాకానికి వందనం చేస్తున్నప్పుడు 78 సంవత్సరాల క్రితం ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన త్యాగధనులందరికీ కూడా నివాళులు అర్పిస్తామని అన్నారు.
READ MORE: Alaska sale history: అమెరికాకు అలస్కా బేరం.. ఎంతకు అమ్మారంటే..?
తాజావార్తలు
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
-
Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్గా రేర్ రికార్డు!
-
Harish Rao: “నీకు మా రక్తం కావాలా”.. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
-
Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..