UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు షాక్.. త్వరలో ఆ సేవలు బంద్!
- ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు షాక్..
- త్వరలోనే ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్ను తొలగించే ఛాన్స్..
- సైబర్ మోసాలు పెరిగిపోతుండటంతోనే ఈ నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Payments: మీరు యూపీఐ యాప్లు ఉపయోగిస్తున్నారా? అయితే ఈ మార్పుల గురించి తప్పక మీరు తెలుసుకోవాల్సిందే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి యూపీఐలోని పర్సన్-టు-పర్సన్ (P2P) ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ ఫీచర్ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి డబ్బు అడగడానికి, బిల్లులు షేర్ చేసుకోవడానికి ఉపయోగపడేది. కానీ, ఇటీవల సైబర్ మోసగాళ్లు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో నకిలీ పేమెంట్ రిక్వెస్ట్లు పంపి, వినియోగదారులకు తెలియకుండానే లావాదేవీలు జరుపుతున్నారు.
Read Also: Allu Aravind: ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.. బడా నిర్మాత సంచలన కామెంట్స్!
Also Read
- Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ 'మాస్' స్టేట్మెంట్!
- Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- IMD Yellow Alert: నిప్పుల కొలిమిలా ఉత్తర భారతం.. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా చేరిన ఉష్ణోగ్రతలు.. ఐఎండి తీవ్ర హెచ్చరిక!
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఇక, NPCI ఇప్పటికే ట్రాన్సాక్షన్ పరిమితిని రూ. 2 వేలకు తగ్గించినప్పటికీ, మోసాలు తగ్గకపోవడంతో.. కస్టమర్ల భద్రత కోసం, యూపీఐపై నమ్మకాన్ని కాపాడుకునేందుకు ఈ ఫీచర్ను దశలవారీగా నిలిపివేయాలని ప్లాన్ చేస్తుంది. అయితే, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, ఐఆర్సిటిసి లాంటి ప్లాట్ఫారమ్లు ఉపయోగించే మెర్చంట్ కలెక్ట్ రిక్వెస్ట్లు మాత్రం కొనసాగుతుందని వెల్లడించింది. వీటికి వినియోగదారుల ఆమోదం, యూపీఐ పిన్ తప్పనిసరి చేసింది.
Read Also: Alaska sale history: అమెరికాకు అలస్కా బేరం.. ఎంతకు అమ్మారంటే..?
అయితే, ఇక నుంచి మీరు డబ్బులు పంపించాలంటే QR కోడ్ స్కాన్ చేయాలి, లేదా రిసీవర్ యూపీఐ ఐడీ / ఫోన్ నెంబర్ నమోదు చేసి, పిన్ ద్వారా లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. కాగా, అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్లీజ్ పే మీ రిక్వెస్ట్ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండదు. అయితే, వినియోగదారులు ఈ మార్పులను గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. ముఖ్యంగా, మీ ఫోన్ను ఇతరులకు ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎందుకంటే అది మోసాలకు దారి తీసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!