UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు షాక్.. త్వరలో ఆ సేవలు బంద్!
- ఫోన్ పే, గూగుల్ పే వినియోగదారులకు షాక్..
- త్వరలోనే ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్ను తొలగించే ఛాన్స్..
- సైబర్ మోసాలు పెరిగిపోతుండటంతోనే ఈ నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI Payments: మీరు యూపీఐ యాప్లు ఉపయోగిస్తున్నారా? అయితే ఈ మార్పుల గురించి తప్పక మీరు తెలుసుకోవాల్సిందే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి యూపీఐలోని పర్సన్-టు-పర్సన్ (P2P) ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ ఫీచర్ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుంచి డబ్బు అడగడానికి, బిల్లులు షేర్ చేసుకోవడానికి ఉపయోగపడేది. కానీ, ఇటీవల సైబర్ మోసగాళ్లు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో నకిలీ పేమెంట్ రిక్వెస్ట్లు పంపి, వినియోగదారులకు తెలియకుండానే లావాదేవీలు జరుపుతున్నారు.
Read Also: Allu Aravind: ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే.. బడా నిర్మాత సంచలన కామెంట్స్!
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
ఇక, NPCI ఇప్పటికే ట్రాన్సాక్షన్ పరిమితిని రూ. 2 వేలకు తగ్గించినప్పటికీ, మోసాలు తగ్గకపోవడంతో.. కస్టమర్ల భద్రత కోసం, యూపీఐపై నమ్మకాన్ని కాపాడుకునేందుకు ఈ ఫీచర్ను దశలవారీగా నిలిపివేయాలని ప్లాన్ చేస్తుంది. అయితే, ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, ఐఆర్సిటిసి లాంటి ప్లాట్ఫారమ్లు ఉపయోగించే మెర్చంట్ కలెక్ట్ రిక్వెస్ట్లు మాత్రం కొనసాగుతుందని వెల్లడించింది. వీటికి వినియోగదారుల ఆమోదం, యూపీఐ పిన్ తప్పనిసరి చేసింది.
Read Also: Alaska sale history: అమెరికాకు అలస్కా బేరం.. ఎంతకు అమ్మారంటే..?
అయితే, ఇక నుంచి మీరు డబ్బులు పంపించాలంటే QR కోడ్ స్కాన్ చేయాలి, లేదా రిసీవర్ యూపీఐ ఐడీ / ఫోన్ నెంబర్ నమోదు చేసి, పిన్ ద్వారా లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. కాగా, అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్లీజ్ పే మీ రిక్వెస్ట్ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండదు. అయితే, వినియోగదారులు ఈ మార్పులను గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. ముఖ్యంగా, మీ ఫోన్ను ఇతరులకు ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎందుకంటే అది మోసాలకు దారి తీసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
-
PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!