MS Dhoni: ఐపీఎల్లో ధోని ఉన్నన్ని రోజులు స్టేడియాలు పసుపెక్కాల్సిందే..
- ఎంఎస్ ధోని ఉన్నంత కాలం, ఏ స్టేడియమైనా పసుపుమయమే- జహీర్ ఖాన్
- ధోనికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది- జహీర్ ఖాన్
- అతను ఐపీఎల్ ఆడుతున్నంత కాలం.. ఇది కొనసాగుతూనే ఉంటుంది- జహీర్.
మరో రెండ్రోజుల్లో ఐపీఎల్ సంగ్రామం ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ తమ హోంగ్రౌండ్లలో ప్రాక్టీస్లలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మెంటర్, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. ఎం.ఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య హైఓల్టోజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ రెండు జట్లు లక్నోలో ఆడినప్పుడు.. వారి అభిమానులు స్టేడియంలో అధికంగా ఉంటారని.. ఈ ట్రెండ్ మార్చడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయని ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు జహీర్ ఖాన్ సరదాగా స్పందించారు. “ఎంఎస్ ధోని ఉన్నంత కాలం, ఏ స్టేడియమైనా పసుపుమయంగా మారుతుంది. ధోనికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతను ఐపీఎల్ ఆడుతున్నంత కాలం.. ఇది కొనసాగుతూనే ఉంటుంది,” అని చెప్పారు. చెన్నై సూపర్ కింగ్స్ లక్నోలో ఆడినప్పుడల్లా స్టేడియం మొత్తం ఎల్లో జెర్సీలే దర్శనమిస్తాయని తెలిపారు. ఏప్రిల్ 14, 2024న జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో కూడా స్టేడియం పసుపుమయంగా మారింది. ఆ మ్యాచ్లో ధోని కేవలం తొమ్మిది బంతుల్లో 28 పరుగులు చేశాడు. 3 బౌండరీలు, 2 సిక్సర్లతో అభిమానులను ఉత్సాహపరిచాడు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
Read Also: KTR: రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా.. జహీర్ ఖాన్కు మరో ఆసక్తికర సంఘటన ఎదురైంది. 2005లో బెంగళూరులో జరిగిన భారత్-పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా.. ఒక మహిళా అభిమాని స్టేడియంలో ‘జహీర్, ఐ లవ్ యూ’ అని రాసిన ప్లకార్డుతో ప్రపోజ్ చేసింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత.. అదే అభిమాని లక్నో సూపర్ జెయింట్స్ ప్రీ-సీజన్ శిబిరంలో జహీర్ను కలుసుకుని, మరోసారి ‘జహీర్, ఐ లవ్ యూ’ అని రాసిన ప్లకార్డుతో సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2025 కోసం రిషబ్ పంత్ను కెప్టెన్గా నియమించుకుంది. అయితే, గాయాల కారణంగా మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్లు ప్రారంభ మ్యాచ్లకు దూరంగా ఉండనున్నారు. శివమ్ మావి, శార్దూల్ ఠాకూర్ జట్టుతో శిక్షణ పొందుతున్నారని, ప్రత్యామ్నాయంగా వారిని తీసుకునే అవకాశం ఉందని సమాచారం. లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్ మార్చి 24, సోమవారం విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది.
తాజావార్తలు
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!