Samajika Sadhikara Bus Yatra: సామాజిక సాధికార యాత్ర.. మూడో రోజు షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samajika Sadhikara Bus Yatra: తన పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందజేసిన సంక్షేమ పథకాల ఫలాలను వివరిస్తూ.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సామాజిక సాధికార యాత్ర పేరుతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలు చేపట్టింది.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర.. ఇలా మూడు ప్రాంతాల్లో ఒకేసారి యాత్రలు నిర్వహిస్తున్నారు.. డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని.. తన ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు.. అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరిస్తున్నారు.. ఇప్పటికే రెండు రోజుల పాటు ఈ యాత్రలు విజయవంతంగా సాగగా.. మూడో రోజు షెడ్యూల్ ఇలా ఉండనుంది..
ఉత్తరాంధ్ర విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో మూడో రోజు సామాజిక సాధికార యాత్ర నిర్వహించనున్నారు.. మంత్రులు బొత్స సత్యనారాయణ, సిదిరి అప్పలరాజు, కార్మూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, విడదల రజినీ, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఇతర నేతలు పాల్గొననున్నారు.. మధ్యాహ్నం 12:30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది.. ఇక, విశాఖపట్నం జిల్లా పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం ఉంటుంది.. మధురవాడ చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్లో నాడు-నేడు పనులను పరిశీలిస్తారు.. మధ్యాహ్నం 2 గంటలకు బోయపాలెంలో భోజన విరామం ఉండగా.. మధ్యాహ్నం 3 గంటలకు తగరపువలస గ్రౌండ్స్ లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Also Read
- BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
- Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
ఇక, కోస్తా రీజన్ విషయానికి వస్తే బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర జరగనుంది.. మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పార్థసారథి, ఇతర ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొననున్నారు.. మధ్యాహ్నం 12 గంటలకు చందోల్ లో దేవాలయంలో ప్రత్యే పూజలు.. 12:30కు పెద్ద మసీద్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.. ఇక, చందోల్ జడ్పీ హైస్కూల్ లో నాడు -నేడు పనులను సందర్శించనున్నారు.. సాయంత్రం 4 గంటలకు జడ్పీహెచ్ఎస్ నుంచి కర్లపాలెం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు.. సాయంత్రం 5 గంటలకు బాపట్ల అంబేద్కర్ సెంటర్ దగ్గర బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు.
మరోవైపు రాయలసీమ రీజన్ విషయానికి వస్తే.. నేడు కడప జిల్లా ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర నిర్వహించనున్నారు.. డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, బుట్టా రేణుక, ఆకేపాటి అమర్నాథ్, ఇతర నేతలు పాల్గొన్నారు.. మధ్యాహ్నం 12 గంటలకు వైవీఆర్ ఫంక్షన్ హాల్ లో స్థానికులతో సమావేశం జరగనుంది.. ఒంటిగంటకు మీడియా సమావేశం నిర్వహిస్తారు.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు రామేశ్వరం నుంచి శివాలయం సర్కిల్ వరకు బైక్, ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నారు.. సాయంత్రం 5 గంటలకు శివాలయం సర్కిల్ దగ్గర బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లలో మునిగిపోయాయి వైసీపీ శ్రేణులు.
తాజావార్తలు
-
BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
-
NSE Trading Hours Change: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయం మార్పు.. ఎన్ఎస్ఈ కీలక ప్రకటన!
-
Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
-
Lashkar-e-Taiba: భారత్ను టార్గెట్ చేస్తూ బార్డర్ల కొత్త ఉగ్ర కోట.. నిఘా వర్గాల చేతికి లష్కర్ సీక్రెట్ మ్యాప్!
-
Ducati Collezione 100: డుకాటి ‘Collezione 100’ స్పెషల్ ఎడిషన్ బైక్స్.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..