Mega DSC: ‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ యువజన, విద్యార్థి విభాగాలు భారీ నిరసన ర్యాలీలు నిర్వహించాయి. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. కాకినాడ, గుంటూరు, అనంతపురం, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాకినాడలో నిర్వహించిన ర్యాలీలో మెగా డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని వైసీపీ నాయకులు ప్రశ్నించారు. విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ నినాదాలు చేశారు. గుంటూరులో శంకర్ విలాస్ నుంచి లాడ్జి సెంటర్ వరకు వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన యువత ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించారు.
Also Read
- Fake DAP Fertilizer Scam: నకిలీ డీఏపీ ఎరువుల కలకలం.. ప్రభుత్వం సీరియస్.. విచారణకు ఆదేశాలు.!
- ED Raids: హైదరాబాద్లో ఈడీ సోదాలు.. అమెరికన్లనే టార్గెట్గా మోసాలు.!
- 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
- Ind vs SL: 'జడేజా' రీఎంట్రీ.. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన.!
రాష్ట్ర వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూడా బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని, నకిలీ సర్టిఫికెట్లు వినియోగించారని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరపాలని కోరారు. తనపై కేసులు పెట్టినా భయపడబోమని స్పష్టం చేశారు.
అనంతపురంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో కూడా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఏలూరులో వైసీపీ రాష్ట్ర యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. “మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ” అంటూ నినాదాలు చేస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలో జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని, డీఎస్సీ పోస్టుల భర్తీలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర యువజన విభాగం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ నిరసన కార్యక్రమాల ద్వారా డీఎస్సీ నియామకాలపై సీబీఐతో విచారణ జరిపించాలని.. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.
- Tags
- ap
- CBI
- mega dsc
- Nara Lokesh
- ycp
తాజావార్తలు
-
Mega DSC: ‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు, లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్!
-
Fake DAP Fertilizer Scam: నకిలీ డీఏపీ ఎరువుల కలకలం.. ప్రభుత్వం సీరియస్.. విచారణకు ఆదేశాలు.!
-
Team India: ఆ చెత్త ప్లేయర్స్ ఎందుకు.. వెంటనే టీమిండియాలో నుంచి తీసేయండి!
-
Rao Bahadur OTT: ఐదు భాషల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘రావ్ బహదూర్’.. త్వరలోనే స్ట్రీమింగ్
-
Flipkart Freedom Sale 2026: ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్ డేట్ ఫిక్స్.. iPhone 17, Galaxy S25పై భారీ డీల్స్
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!