Memantha Siddham Bus Yatra: 5వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నేడు ఇలా సాగనున్న జగన్ టూర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Memantha Siddham Bus Yatra: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రాన్ని మరోసారి చుట్టేసే పనిలో పడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో మళ్లీ ప్రజలతో మమేకం అవుతున్నారు.. ఇక, నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర 5వ రోజుకు చేరుకుంది.. యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్.. శ్రీసత్యసాయి జిల్లాలోని సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఈ రోజు ఉదయం 9 గంటలకు తన యాత్రను ప్రారంభిస్తారు.. బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ఎస్పీ కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం చేరుకోనుంది బస్సు యాత్ర..
Read Also: Venu Swamy : ఏంటి వేణుస్వామి.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా?
Also Read
ఇక, పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకున్న తర్వాత మధ్యాహ్న భోజన విరామం తీసుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.. అనంతరం బయలుదేరి కదిరి చేరుకోనున్నారు.. స్థానికంగా ఉన్న పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో రంజాన్ను పురస్కరించుకుని.. మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు సీఎం జగన్.. ఆ తర్వాత మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెకు చేరుకుని రాత్రి బస చేయనున్నారు. మరోవైపు.. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు..
తాజావార్తలు
-
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు.. మిషన్ 360పై మోడీ సర్కార్ ఫోకస్..
-
Hair Growth Tips: జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోతోందా?.. ఈ చిట్కాలు చాలు..
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!