Srinivasa Reddy: ప్రజా ఆరోగ్య వ్యవస్థను ప్రైవేట్ పరం చేసి పేదల దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నారు
- ప్రజా ఆరోగ్య వ్యవస్థను ప్రైవేట్ పరం చేసి
- పేదల దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నారు
- వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srinivasa Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తాజాగా అమరావతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెట్టారని, గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యాన్ని తీసుకెళ్లిన ఘనత ఆయనదని పేర్కొన్నారు. విలేజ్ క్లినిక్ ల ద్వారా గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యం అందించారని.. మండలానికి రెండు పీహెచ్సిలు ఉండాలనే ఆలోచనతో 80 కొత్త పీహెచ్సీలు ఏర్పాటు చేసారని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను పటిష్టం చేశారని, ఆరోగ్య రంగంలో 54 వేల ఉద్యోగాలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. పేదప్రజలకు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అందేలా చేశారని ఆయన అన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో జగన్ పనిచేశారని, చంద్రబాబు పిపి విధానంలో వైద్యం అందిస్తామంటున్నాడని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ఆరోగ్య వ్యవస్థను ప్రైవేట్ పరం చేసి పేదల దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నాడని, జగన్ తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. వైద్యాన్ని కూడా ఉచితంగా ఇవ్వలేకపోతే ఎందుకు మీ ప్రభుత్వమని పేర్కొన్నారు. జగన్ ఐదేళ్లలో 14 లక్షల మందికి 13 వేల కోట్లు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించారని, ఈ ప్రభుత్వం 3500 కోట్లు బకాయిలు పెట్టిందని తెలిపారు. ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తే 500 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని.. ఈ ప్రభుత్వ వైఖరిచో ఆసుపత్రులు మూసివేసే పరిస్థితికి చేరుకున్నాయని ఎద్దేవా చేసారు.
Also Read
- Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
- Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
ఆరోగ్యశ్రీని కొనసాగిస్తారా..? ఆపేస్తారా? అనిచంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీని పక్కన పెట్టి ఇన్స్యూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తోందని, అందుకే నెట్ వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతోందని ఆయన అన్నారు. ఆరోగ్య శ్రీ కింద బైపాస్ సర్జరీ చేయించుకుంటే ఆసుపత్రులు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాయని.. వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన మానుకోవాలని కోరుతున్నట్లు ఆయన అన్నారు. జగన్ మీద కోపంతో ప్రజాఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసేలా చూడొద్దని అన్నారు.
తాజావార్తలు
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!