Dastagiri: దస్తగిరి దాదాగిరి చేస్తున్నాడా..? ఇవి అందులో భాగమేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dastagiri: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి.. రెచ్చిపోయాడు. కడప జిల్లా పులివెందుల వీధుల్లో వైసీపీ నేతలను ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. నోటికి అడ్డు అదుపు లేకుండా.. బూతులు వాగాడు. సీబీఐ ఇచ్చిన సెక్యూరిటీతో…తనను ఎవరు ఏమీ చేయలేరన్న ధీమాతో రౌడీలా వైసీపీ లీడర్లకు వార్నింగ్ ఇచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత…చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు.
సీబీఐ కల్పించిన సెక్యూరిటీని అడ్డం పెట్టుకుని సెటిల్ మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. రైల్వే కోడూరులో నాలుగు షాపుల వ్యవహరంలో… గదులకు తాళాలు వేసి అరాచకం సృష్టించాడు. అధిక వడ్డీలకు ఇస్తూ.. బాధితులను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. పులివెందుల జయమ్మ కాలనీకి చెందిన గులాబీ అనే మహిళకు అప్పు ఇచ్చాడు. వారం వారం వడ్డీ చెల్లించే పద్దతిలో తీసుకున్నారు. ఆర్థిక కారణాలతో కొన్ని వారాలుగా వడ్డీ డబ్బులు చెల్లించలేదు. వ్యక్తిగత పనులతో గులాబీ, ఆయన కుటుంబ సభ్యులు కొందరు వేరే ఊరికి వెళ్ళారు. వడ్డీ డబ్బులు చెల్లించడం లేదని.. గులాబీ కుమారుడు గూగుడువలిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. ఇంట్లో నిర్భంధించాడు. తల్లిదండ్రులు వడ్డీ చెల్లించలేదనంటూ…బాలుడ్ని చిత్రహింసలు పెట్టాడు.
Also Read
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
గులాబీకి ఫోన్ చేసిన దస్తగిరి.. డబ్బు చెల్లించకపోతే కొడుకు మరింత హింసిస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఈ నెల 19న గులాబీ పులివెందుల పోలీసులను ఆశ్రయించింది. దస్తగిరి చెరలో ఉన్న గూగూడువలిని విడిపించి, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మైనర్ బాలుడిని తీసుకురావడం, చిత్ర హింసలు పాలు చేయడం, బెదిరించడం, అధిక వడ్డీలు వసూలు చేస్తూ చట్టవ్యతిరేక చర్యలు పాల్పడుతున్న దస్తగిరి దంపతులపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. గత ఏడాది మే నెలలో తొండూరు పోలీస్టేషన్లోనే.. మల్లెల గ్రామానికి చెందిన పెద్ద గోపాల్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. ఇదే మండలంలో ఎలక్ట్రికల్ ఉపకరణాలు దొంగలించారన్న అభియోగాలపై దస్తగిరిపై కేసు నమోదైంది. శ్రీకాళహస్తిలో కుటుంబాల మధ్య ఉన్న వివాదంలోకి ఎంటరై.. వార్నింగ్ ఇచ్చాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు పెట్టారు.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!