YS Sharmila : మహాత్మాగాంధీ ఒక నిస్వార్థ పరుడు.. కేసీఅర్ ఒక స్వార్థ పరుడు, అవినీతి పరుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రాష్ట్రంలోని జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఆమె మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నేడు మెదక్లోని శంకరంపేటలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. సీఎం కేసీఅర్ మహాత్మా గాంధీతో పోల్చుకోవడం విడ్డూరమన్నారు. కేసీఆర్ మాదిరిగా మహాత్మగాంధీ ఎప్పుడు దొంగ దీక్షలు చేయలేదన్నారు. దొంగ దీక్షలు చేసిన వాళ్ళు ఈరోజు మహాత్మతో పోల్చుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కోట్ల మంది ప్రజలు కొట్లాడితే వచ్చింది తెలంగాణ అని, లక్షల మంది ఆస్తులు త్యాగం చేస్తే వచ్చింది తెలంగాణ..వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చింది తెలంగాణ అని ఆమె వ్యాఖ్యానించారు.
Also Read
అంతేకాకుండా.. కేసీఅర్ ఏమో నేనే తెచ్చాను అని చెప్పుకుంటున్నారని, కేసీఅర్ ఇంట్లో ఎంత మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు…? అని ఆమె ప్రశ్నించారు. గడ్డాలు పెంచారు..దొంగ దీక్షలు చేశారు..ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మరిచిపోయారంటూ ఆమె ఎద్దేవా చేశారు. మహాత్మా గాంధీ ఒక నిస్వార్థ పరుడని, కేసీఅర్ ఒక స్వార్థ పరుడు ఒక అవినీతి పరుడంటూ ఆమె ఆరోపించారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!