YS Jagan: మేం ఐదేళ్లలో 3.30 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 3.80 లక్షల కోట్లు చేసింది!
- కూటమి ప్రభుత్వం ఇప్పటికే మూడు బడ్జెట్లు పెట్టింది
- అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా?
- బడ్జెట్లో మోసాలు, కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయి
- కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు కాగ్ రిపోర్ట్ చెప్పింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూటమి ప్రభుత్వం ఇప్పటికే మూడు బడ్జెట్లు పెట్టిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. దాదాపు 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయాయని, అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? అని ప్రశ్నించారు. బడ్జెట్లో మోసాలు, కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయని విరామర్శించారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు కాగ్ రిపోర్ట్ చెప్పిందని పేర్కొన్నారు. తాము ఐదేళ్లలో 3.30 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 3.80 లక్షల కోట్లు చేసిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన పలు అంశాలపై జగన్ మాట్లాడారు.
‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మూడు బడ్జెట్లు పెట్టారు. దాదాపు 16 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్ర ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా?. బడ్జెట్లో ఆయన మోసాలు, కల్పిత లెక్కలు మాత్రమే కనిపించాయి తప్ప జరిగిన మేలు సున్నా. బడ్జెట్ కేటాయింపులపై గత ప్రెస్ మీట్లోనే అడగటం జరిగింది. కాగ్ రిపోర్ట్ కూడా నేను చెప్పిన అంశాలనే రుజువు చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్లు కాగ్ రిపోర్ట్ చెప్పింది. మా ప్రభుత్వం చివరి సంవత్సరం చేసిన ఖర్చు 2.36 లక్షల కోట్లు, వచ్చిన ఆదాయం 1.73 లక్షల కోట్లు. రెవెన్యూ లోటు 38,683 కోట్లు, ద్రవ్యలోటు 62,720 కోట్లు. 2024 – 25 మధ్య చేసిన ఖర్చు 2.49 లక్షల కోట్లు, వచ్చిన ఆదాయం 1.68 లక్షల కోట్లు. రెవెన్యూ లోటు 60,285 కోట్లు, ద్రవ్యలోటు 81,071 కోట్లు. చంద్రబాబు మొదటి ఏడాదిలో రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గాయి. రెవెన్యూ లోటు 56 శాతం పెరిగింది. అప్పులు మాకంటే 30 శాతం పెరిగాయి. మొదటి ఏడాది అసలు ఏ స్కీంలు ఇవ్వలేదు. మేము ఇచ్చిన స్కీములు కూడా రద్దు చేశారు’ అని వైఎస్ జగన్ అన్నారు.
Also Read
- PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
- Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
- Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్పై కేసు!
‘2019 – 24 మధ్య కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా మానిఫెస్టో అమలు చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పులు 2024 – 25లో 32.55 శాతం అప్పులు చేశారు. ఇప్పటివరకు ఈ ఆర్ధిక సంవత్సరంలో 39.74 అప్పులు చేశారు. జీఎస్డీపీలో మేం చేసిన అప్పులు 4.111 శాతం. జీఎస్డీపీలో కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు 5.089 శాతం. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపటంలో చంద్రబాబు విశ్వాసానికి ఇది ఉదాహరణ. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఎన్బీసీని ఉల్లగిస్తూనే ఉంటారు. మరోవైపు పరిపాలనాదక్షుడిగా బిల్డప్ ఇస్తుంటారు. నెట్ బారోయింగ్ సీలింగ్కు మించి ప్రతిసారి అప్పులు చేస్తారు. మేం ఎప్పుడు ఎన్బీసీ పరిమితి కన్నారూ.12,707 కోట్లు తక్కువగానే అప్పులు చేశాం. చంద్రబాబు మళ్లీ వచ్చాక చేసిన అప్పులు రూ.3.31 లక్షల కోట్లు దాటాయి. చేసిన అప్పులు మొత్తానికి జీవోలు కూడా ఉన్నాయి. మేం ఐదేళ్లలో చేసిన అప్పులు చంద్రబాబు రెండేళ్ల లోపే చేశారు. ఆయన వస్తే ఎందుకు అప్పులు పెరుగుతున్నాయి?. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాకపోవటమే దానికి కారణం’ అని జగన్ ఫైర్ అయ్యారు.
‘రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతుంది. దోచుకో.. పంచుకో.. తినుకో.. అన్నట్లుగా చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు, సహచరులు దేన్నీ వదలటం లేదు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా నడుస్తుంది. అన్నిట్లో దోపిడీ అయితే ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి. విశాఖలో ఐదు వేల కోట్ల విలువైన భూమిని చంద్రబాబు దగ్గరుండి ఆయన సమీప బంధువులకు కట్టబెట్టే కార్యక్రమం చేస్తే ఆదాయాలు ఎలా వస్తాయి. రియల్ ఎస్టేట్ సంస్థలకు అతితక్కువ ధరకు భూములు ఇస్తున్నారు. ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్ కూడా ఉండటం లేదు. మేము కొవిడ్ సహా అనేక ఇబ్బందులతో రాష్ట్రాన్ని నడిపాం. 365 రోజుల్లో ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్ ఉన్నది కేవలం 8 రోజులు మాత్రమే. ఓవైపు మా మీద తప్పుడు ప్రచారం చేస్తారు. మరోవైపు వాళ్ళు చేస్తున్న అప్పులు కూడా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాగ్ రిపోర్టు స్టేట్మెంట్ 6 ప్రకారం రూ.81,082 కోట్ల అప్పులు చూపిస్తుంటే.. అసెంబ్లీలో రూ.60,485 కోట్లని చెప్పారు. ఇలాంటి రిపోర్టులు ఇచ్చి సభను తప్పుదోవ పట్టించినందుకు లేఖలు రాస్తున్నాం’ అని జగన్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
PM Modi: మోడీ ముంబై టూర్లో కలకలం.. ఇద్దరు అనుమానితుల నుంచి నకిలీ ID, తుపాకీ స్వాధీనం!
-
Supreme Court: ‘మా మనసులో ఒక ఆలోచన ఉంది’.. హాస్టళ్ల భద్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
-
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
-
Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్.. బీఆర్ఎస్ తీరుపై అసంతృప్తి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!