UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
- ఐక్యరాజ్యసమితి కొత్త ప్రపంచ పటంపై వివాదం..
- అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్లపై వివాదాస్పద చిత్రీకరణ..
- తీర్మానానికి మద్దతు ఉంది కానీ, తీర్మానం ద్వారా వచ్చిన మ్యాప్కు మద్దతు లేదన్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UN Map Controversy: ఐక్యరాజ్యసమితి రూపొందించిన కొత్త ప్రపంచ పటంలో అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్ చిన్ ప్రాంతాలను భారత్ సరిహద్దు బయట ఉన్నట్లు కనిపించడం వివాదానికి దారి తీసింది. ఈ రెండు ప్రాంతాలు భారత్-చైనా సరిహద్దు వాదనల మధ్య వేర్వేరు ప్రాంతాలుగా ఉన్నట్లు కనిపించడం వివాదాస్పదంగా మారింది. ఇటీవల ఐక్యరాజ్యసమితి ‘‘కరెక్ట్ ద మ్యాప్’’ తీర్మానం తర్వాత ఈ కొత్త మ్యాప్ వచ్చింది.
ఇదే కాకుండా అరుణాచల్కు నాగాలాండ్తో ఉన్న సరిహద్దును తొలగిస్తూ, ఆ ప్రాంతాన్ని అస్సాం, చైనాలతో సరిహద్దు పంచుకునే స్వతంత్ర ప్రాంతంగా మ్యాప్లో తప్పుగా చూపించారు. అక్సాయ్ చిన్ను పశ్చిమ సరిహద్దు భారతదేశంలో, తూర్పు సరిహద్దును చైనాతో సరిహద్దు కలిగిన ఒక స్వతంత్ర ప్రాంతంగా చూపించారు. ఈ మార్పుల వెనక కారణాలను ఐక్యరాజ్యసమితి ఇంకా వివరించలేదు. జమ్మూ కాశ్మీర్ విషయంలో మాత్రం మ్యాప్లో నియంత్రణ రేఖను (LoC) చుక్కల రేఖతో చూపించారు. భారత్, పాకిస్థాన్ మధ్య జమ్మూ కాశ్మీర్ తుది స్థితిపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని చెప్పింది.
Also Read
- Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్పై కేసు!
- Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
- Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
- Rahul Gandhi New Team: రాహుల్ గాంధీ కొత్త టీమ్ రెడీ.. 120 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ
వాస్తవ విస్తీర్ణాలను ప్రతిబింబించేలా కొత్త వరల్డ్ మ్యాప్ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 04న ఆమోదించింది. ఈ తీర్మానానికి 164 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. అమెరికా వ్యతిరేకంగా ఓటేసింది. అయితే, ఈ మ్యాప్ తీర్మానానికి భారత్ కూడా మద్దతు తెలిపింది. తాము ఏదైనా నిర్దిష్ట మ్యాప్, మ్యాప్ ప్రొజెక్షన్ లేదా జాతీయ సరిహద్దు చిత్రీకరణను ఆమోదించడం లేదని స్పష్టం చేసింది. సమాన-విస్తీర్ణ ప్రాతినిధ్యాన్ని ప్రోత్సహించే సూత్రానికే భారత్ మద్దతు ఇచ్చిందని విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ మ్యాప్ తీర్మానానికి మద్దతు ఇచ్చింది, కానీ ఆ తీర్మానం ద్వారా వెలువడే సరిహద్దు మ్యాప్ను ఆమోదించలేదు.
జమ్మూ కాశ్మీర్, లడాఖ్ సహా భారత సార్వభౌమ భూభాగాలను భారత అధికారిక మ్యాప్ ప్రకారమే చూపించాలని, తప్పుదారి పట్టించేలా ఉండే మ్యాప్ను అంగీకరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై భారత వైఖరి స్పష్టమైనదని, అందులో ఎలాంటి రాజీ లేదని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడాఖ్ అక్సాయ్ చిన్తో సహా భారత్ తన భూభాగంగా పేర్కొంటుంది.
తాజావార్తలు
-
UN Map Controversy: వరల్డ్ మ్యాప్ వివాదం.. భారత్కు బయట అరుణాచల్, అక్సాయ్ చిన్!
-
Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
-
Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్.. బీఆర్ఎస్ తీరుపై అసంతృప్తి
-
Kerala Anchor Case: మహిళలపై ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలు.. డిబేట్ చేసిన టీవీ యాంకర్పై కేసు!
-
Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!