నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ విధానం అమల్లోకి రానుంది. ఇకపై సభ్యుల హాజరు నమోదు ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా జరగనుంది. సభ్యులు అసెంబ్లీకి వచ్చి సభ లోపల తమ స్థానాల్లో కూర్చున్న తర్వాత మాత్రమే వారి హాజరు నమోదు అయ్యే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ కొత్త విధానాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రవేశపెట్టారు. ఇకపై సంప్రదాయంగా ఉపయోగిస్తున్న హాజరు రిజిస్టర్ విధానం ఉండదని అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ ప్రసన్న కుమార్ నిన్న…
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశముంది. గవర్నర్ ప్రసంగం జరిగే తొలి రోజు సభలో పాల్గొనాలని పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా నిర్ణయించినట్లు సమాచారం. గత ఏడాది బడ్జెట్ సమావేశాల తొలి రోజున కూడా గవర్నర్ ప్రసంగ సమయంలో వైఎస్ జగన్ అసెంబ్లీకి హాజరైన విషయం తెలిసిందే. అదే తరహాలో ఈసారి కూడా తొలి…