అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా గురించి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ చిత్రానికి ‘నితమ్ ఒరు వానమ్’ ఫేమ్ ఆర్.ఏ. కార్తీక్ దర్శకత్వం వహించబోతున్నారనే వార్త ఇప్పటికే ఫ్యాన్స్లో జోష్ నింపింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో కార్తీక్ ఈ ప్రాజెక్ట్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Also Read : Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్సింగ్కు భారీ ఓపెనింగ్స్ వుండవా?
తమిళ ప్రేక్షకులకు నాగార్జున అంటే ‘శివ’, ‘రక్షకుడు’ మరియు ఇటీవలి ‘కూలీ’ చిత్రాలు గుర్తొస్తాయి. అయితే ఈ 100వ సినిమాలో ఆ చిత్రాల ఛాయలతో పాటు, నాగార్జునను గతంలో ఎన్నడూ చూడని విభిన్నమైన గెటప్స్లో చూస్తారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను నిర్మాత అతి త్వరలోనే వెల్లడిసాము’ అని అన్నారు. అలాగే “మీ 100వ సినిమాకు చాలా మంది టాలెంటెడ్ తెలుగు డైరెక్టర్లు అందుబాటులో ఉన్నా, ఒక తమిళ దర్శకుడితో పనిచేయడం మీకు సౌకర్యంగానే ఉందా?” అని నాగార్జునను కార్తీక్ అడిగారట. దానికి నాగ్ బదులిస్తూ ‘గత 40 ఏళ్లుగా తను ఎప్పుడూ హద్దులకు లోబడి పనిచేయలేదని, మణిరత్నం, ప్రియదర్శన్ వంటి ఇతర భాషా దర్శకులను తెలుగుకు పరిచయం చేసింది తానేనని దర్శకుడు ఎక్కడి నుంచి వచ్చారు అనే దానికంటే, కంటెంట్ మరియు మేకింగ్ శైలిపైనే తనకు నమ్మకం ఉంటుందని నాగార్జున అన్నారు. ఈ అప్డేట్తో అక్కినేని అభిమానులు తమ హీరో సెంచరీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న నాగ్ 100వ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.