UP: భారతీయ యువతికి దుబాయ్ లో మరణశిక్ష.. రక్షించాలని వేడుకున్న వృద్ధ తల్లిదండ్రులు
- భారతీయ మహిళకు దుబాయ్ లో మరణశిక్ష
- రక్షించాలని మోడీ..యోగీని వేడుకున్న తల్లిదండ్రులు
- తమ కుమార్తెను తప్పుడు కేసులో ఇరికించారన్న పేరెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాకు చెందిన ఓ యువతిని దుబాయ్లో సెప్టెంబర్ 20 తర్వాత ఉరితీయనున్నారు. జోక్యం చేసుకుని తమ కూతురు ప్రాణాలను కాపాడాలని ప్రధాని మోడీ, సీఎం యోగిని ఈ యువతి తల్లిదండ్రులు వేడుకున్నారు. న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. మోసగాళ్లు తమ కూతురు షెహజాదీని బలవంతంగా.. చిన్నారి హత్య కేసులో ఇరికించారని తల్లిదండ్రులు చెబుతున్నారు. నిజానికి ఆమె ఫేషియల్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లింది. దుబాయ్లో చిక్కుకున్న యువతి తండ్రి ఆగ్రాకి చెందిన ఉజైర్.
READ MORE: Tata Curvv: టాటా మోటార్స్ కర్వ్ ICE మోడల్ విడుదల.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
వాస్తవానికి, బందాలోని మతౌండ్ పోలీస్ స్టేషన్ పరిధి గోయ్రా ముగ్లి గ్రామంలో నివసిస్తున్న సబ్బీర్ ఖాన్ కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్నకుమార్తె షాజాది 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు స్టవ్పై ద్వారా మంటలు వ్యాపించడంతో ముఖం కాలిపోయింది. ముఖం వికృతమైంది. ఈమె సామాజిక సేవ చేసే సంస్థతో సంబంధం కలిగి ఉంది. ఇదిలా ఉండగా ఆగ్రాలో నివాసముంటున్న ఉజైర్ అనే అబ్బాయితో ఫేస్ బుక్ ద్వారా స్నేహం ఏర్పడింది.
READ MORE:TMC Leader: “మీ ఇంట్లోకి దూరి మీ తల్లులు, అక్కాచెల్లెళ్ల అసభ్యకరమైన ఫోటోలు తీస్తాం..”
ఆమె ముఖానికి దుబాయ్లో చికిత్స చేయిస్తానని చెప్పి ఉజైర్ ఆమెను మోసగించాడు. తన అత్తా మామలు తదితర బంధువులు దుబాయ్లో ఉంటున్నారని ఉజైర్ చెప్పాడు. దుబాయ్ తీసుకెళ్లాడు. ఉజైర్ తన కుమార్తెను దుబాయ్లో రూ. 1.5 లక్షలకు విక్రయించాడని షాజాది తండ్రి సబ్బీర్ ఖాన్ ఆరోపించారు. దీంతో పాటు 4 నెలల చిన్నారి మృతి కేసులో షాజాది ని చేర్చారన్నారు.
READ MORE:Heavy Flood in Krishna River: కృష్ణా నదిలో పోటెత్తుతున్న వరద..! వణికిపోతున్న బెజవాడ వాసులు
షాజాది అక్కడ ఓ ఇంట్లో పనిచేస్తుండగా.. యజమాని అనారోగ్యంతో ఉన్న బిడ్డను సరిగ్గా చూసుకోలేదని, దాని కారణంగా పాప మరణించిందని కేసు నమోదైంది. ఆమెను కోర్టులో ప్రవేశ పెట్టగా.. మరణశిక్ష పడింది. బాధితురాలి తండ్రి సబ్బీర్ కోర్టులో ఫిర్యాదు లేఖను అందించారు. నిందితుడైన యువకుడు ఉజైర్, అతని బంధువుతో సహా నలుగురిపై మతౌండ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సెక్షన్ 370/ 370 ఎ/ 419/ 420/ 386/ 311/ 367 కింద కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకుని విచారించాలని, తద్వారా మొత్తం రహస్యం బయటపడాలని తండ్రి పోలీసులను డిమాండ్ చేశారు.
young Indian woman was sentenced to death in Dubai, Latest Telugu News, Uttar Pradesh, Agra, PM Modi, CM Yogi
- Tags
తాజావార్తలు
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!