Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Yesterday Was Bad Friday For Stock Market Investors They Have Lost 11 Lakh Crores In Just Two Days

Today (28-01-23) Business Headlines: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు కోల్పోయిన సంపద. మరిన్ని వార్తలు

Published Date :January 28, 2023 , 5:20 pm
By Akkirala Kondala Rao
Today (28-01-23) Business Headlines: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు కోల్పోయిన సంపద. మరిన్ని వార్తలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Today (28-01-23) Business Headlines:

పెరిగిన జియో, ఎయిర్’టెల్ కస్టమర్లు

గతేడాది నవంబర్’లో రిలయెన్స్ జియో మరియు ఎయిర్’టెల్’కి పాతిక లక్షల మంది వినియోగదారులు పెరిగారు. వొడాఫోన్ ఐడియాకి మాత్రం 18 లక్షల మందికి పైగా తగ్గారు. ఈ విషయాలను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. రిలయెన్స్ జియో 14 లక్షల 26 వేల మందిని, ఎయిర్’టెల్ 10 లక్షల 56 వేల మందిని కొత్తగా చేర్చుకున్నాయి. దీంతో జియో మొత్తం వినియోగదారుల సంఖ్య 42 కోట్ల 13 లక్షలకు చేరింది. ఎయిర్’టెల్ కస్టమర్ల మొత్తం సంఖ్య 36 కోట్ల 60 లక్షలకు పెరిగింది. వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య మాత్రం 24 కోట్ల 37 లక్షలకు పరిమితమైంది.

ఎయిరిండియాను ‘టాటా’ కొని ఏడాది

ఎయిరిండియాను టాటా గ్రూపు కొనుగోలు చేసి ఏడాది పూర్తయింది. ఈ కాలంలో సంస్థ చెప్పుకోదగ్గ వృద్ధి సాధించినట్లు ఎయిరిండియా CEO క్యాంబెల్ విల్సన్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో సాధించాల్సిన పురోగతికి సంబంధించిన ప్రణాళికలను విహాన్ డాట్ ఏఐ పేరిట సిద్ధం చేసింది. విమానాల్లో మార్పులు చేర్పుల కోసం 400 మిలియన్ డాలర్లు ఖర్చుచేయనున్నామని విల్సన్ తెలిపారు. ఏడాది కాలంలో ఎయిరిండియా విమానాల సంఖ్య 100కు చేరినట్లు వెల్లడించారు. కొత్తగా 16 ఇంటర్నేషనల్ రూట్లలో సర్వీసులు ప్రారంభమయ్యాయన్నారు.

2 రోజుల్లో రూ.11 లక్షల కోట్లు ఆవిరి

ఇండియన్ స్టాక్ మార్కెట్’కి నిన్న శుక్రవారం బ్యాడ్ ఫ్రైడేగా మారింది. సెన్సెక్స్ గత నెల రోజుల కాలంలో అత్యంత ఎక్కువగా నష్టపోయింది. నిఫ్టీది కూడా ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో.. రెండు రోజుల వ్యవధిలో సెన్సెక్స్ 16 వందల 47 పాయింట్లు కోల్పోయింది. దీంతో ఇన్వెస్టర్లు దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల సంపదను నష్టపోయారు. బ్యాంకింగ్ షేర్లు డీలా పడ్డాయి. అమ్మకాల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. మరో వైపు.. హిండెన్’బర్గ్ రిపోర్టు నేపథ్యంలో గౌతమ్ అదానీ గ్రూపు కంపెనీల షేర్లు భారీగా క్షీణించటం దీనికి మరో కారణం.

ఆయుష్మాన్ నిధులు ప్రైవేట్’కివ్వండి

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన నిధులను ప్రత్యేకంగా ప్రైవేట్ రంగానికి కేటాయించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కొత్త బడ్జెట్’ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఈ కీలక అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఆయుష్మాన్ భారత్’లో ప్రస్తుతం ఇస్తున్న ఫండ్స్ దాదాపు 12 వేల కోట్ల రూపాయలని, ఈ మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ స్థాయిలో సుమారు ఒకటీ పాయింట్ 6 లక్షల కోట్లకు పెంచాలని సూచించింది.

గోల్డ్’మ్యాన్ శాక్ సీఈఓ పేప్యాకేజీ కట్

గోల్డ్’మ్యాన్ శాక్ కంపెనీ CEO డేవిడ్ సోలోమాన్ పేప్యాకేజీలో 30 శాతం కోత పడింది. 2021వ సంవత్సరంలో ఆయన పనితీరు ఆధారిత పేప్యాకేజీ 35 మిలియన్ డాలర్లు కాగా అది 2022వ సంవత్సరంలో 25 మిలియన్ డాలర్లకు పడిపోయింది. బేసిక్ శాలరీ 2 మిలియన్ డాలర్లు కాగా అందులో ఎలాంటి మార్పూ లేదని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్’కి ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో మోర్గాన్ స్టాన్లీ CEO శాలరీ కూడా కట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గోల్డ్’మ్యాన్ శాక్ సంస్థ సైతం ఇదే నిర్ణయం తీసుకోవటంతో ప్రస్తుత ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో లేఆఫ్’ల మాదిరిగానే ఇదొక ట్రెండ్’గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజ్ జీవీకే మంచి త్రైమాసిక పనితీరు

తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ మంచి పని తీరు కనబరిచింది. ఆదాయంలో, లాభంలో గణనీయమైన వృద్ధి సాధించింది. డిసెంబర్ త్రైమాసికంలో 105 కోట్ల రూపాయల రెవెన్యూని, 17 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలోని ఇదే కాలంలో ఆదాయం 82 కోట్లు కాగా నికర లాభం 12 కోట్లు మాత్రమే. తాజ్ జీవీకే గత తొమ్మిది నెలల్లో మొత్తం 65 కోట్ల రూపాయల లాభాన్ని గడించింది. కార్పొరేట్ జర్నీలు, సోషల్ సెలబ్రేషన్స్ పెరగటం వల్లే ఈ గ్రోత్ సాధ్యమైందని సంస్థ చైర్మన్ జీవీకే రెడ్డి చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AirIndia
  • Airtel
  • ayushman bharat funds
  • David M. Solomon
  • goldman sachs ceo

తాజావార్తలు

  • Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

  • Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

  • SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతు.. ఏకంగా రూ.కోటి 20 లక్షలు

  • NTRNeel : విలన్‌గా బాలీవుడ్ స్టార్.. కానీ లుక్ మాత్రం..?

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions