YS Jagan: సమయం వచ్చింది.. జిల్లాల్లోనే నిద్ర చేస్తా: వైఎస్ జగన్
- శ్రీకాకుళం ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం
- జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన
- బుధ, గురువారాల్లో పార్లమెంటులో నిద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరు నెలల పాలనలోనే కూటమి ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత వచ్చిందని, ఇక ఇక ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చిందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. 2025 జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన మొదలువుతుందని, ప్రతి పార్లమెంటులో బుధ, గురువారాల్లో తాను నిద్ర చేస్తాను అని చెప్పారు. ఇలాంటి ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నానని, వైసీపీ పార్టీ నేతలు ఇప్పటికీ ప్రజల్లోకి సగర్వంగా వెళ్ళచ్చన్నారు. వైసీపీకి గత ఎన్నికల్లో 50 శాతం ఓట్ షేర్ వస్తే.. ఈ సారి 40 శాతం వచ్చిందని వైఎస్ జగన్ నేతలతో అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయిన జగన్.. నేతలకు దిశా నిర్దేశం చేశారు.
‘జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన మొదలువుతుంది. జిల్లాల్లో నేను నిద్ర చేస్తాను. ప్రతి పార్లమెంటులో ప్రతి బుధ, గురువారాల్లో నిద్ర చేస్తాను. అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలతో మమేకం అవుతాను. ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చింది. ఆరు నెలల పాలనలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి ప్రభుత్వాన్ని మొదటిసారి చూస్తున్నాం. మన పార్టీ నేతలు ఇప్పటికీ ప్రజల్లోకి సగర్వంగా వెళ్ళచ్చు. ఇచ్చిన హామీలు అమలు చేయటమే దీనికి కారణం. ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి అసత్య హామీలు ఇచ్చారు. మనం లబ్ది చేస్తుంటే వాళ్లు చేస్తామని అబద్దాలు చెబుతున్నారని మన పార్టీ వారు అప్పట్లో చెప్పారు. అతి నిజాయితీ, అతి మంచితనం నాలో ఉన్న సమస్య అని మన పార్టీ వాళ్లు చెప్పారు. అయితే వాటివల్లే మరలా వైసీపీ అధికారంలోకి వస్తుంది. పథకాలు ఇవ్వకుండా.. పథకాలు ఎలా ఉన్నాయి అని అడుగుతారంట. అన్ని వర్గాలు ప్రభుత్వ తీరు వల్ల ఇబ్బందులు పడుతున్నాయి’ అని నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
‘మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం వాగ్దానాలు అమలు చేశాం. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తామో ముందుగానే బడ్జెట్తో పాటు సంక్షేమ కేలండర్ను విడుదల చేసి.. బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశాం. చరిత్రలో వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే ఇలా జరిగింది. మంచి చేసినా కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. కారణాలను పక్కనపెడితే.. మనకు గత ఎన్నికల్లో 50 శాతం ఓట్ షేర్ వస్తే, ఈ సారి 40 శాతం వచ్చింది. జగన్ ప్రతి ఇంటికి పలావు పెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. అందుకే పొరపాటున చేయి అటు వైపు పోయింది. తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా లేదు. గవర్నమెంట్ బడులు వద్దు అని పేదవాడు అనుకునే పరిస్ధితుల్లోకి నెట్టేశారు. వైద్యరంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. వ్యవసాయ రంగం కూడా కుదేలైంది. మనం ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చింది’ అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
- Tags
- ap
- ap news
- srikakulam
- ycp
- ys jagan
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..