MP Sri Krishna Devarayalu: చంద్రబాబుతో వైసీపీ ఎంపీ భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Sri Krishna Devarayalu: ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు ఈ మధ్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు.. హస్తిన చేరుకున్న చంద్రబాబు.. టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు నివాసంలో.. పార్టీ ఎంపీలతో సమావేశం అయ్యారు. ఇదే సమయంలో చంద్రబాబును కలిసేందుకు వచ్చారు లావు శ్రీకృష్ణదేవరాయులు.. నర్సరావుపేట నుంచి మరోసారి లావుకు సీటు ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించిన విషయం విదితమే కాగా.. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఎంపీ లావు.. ఇక, ఆయన చూపు టీడీపీ వైపు అనే ప్రచారం సాగుతూ వచ్చింది.. అయితే, బీజేపీతో పొత్తుల విషయాన్ని చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబును ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఈ సారి టీడీపీ నుంచి ఆయన బరిలోకి దిగుతారనే చర్చ సాగుతోంది.
Read Also: Hamas: కాల్పులపై హమాస్ కొత్త ప్రతిపాదన! వర్క్వుట్ అయితే మాత్రం..!
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
కాగా, వైసీపీకి షాక్ ఇస్తూ.. ఈ మధ్యే నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పల్నాడు ప్రజలు తనను ఎంతగానో ఆదరించారని.. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తుచేసుకున్న ఆయన.. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేశానని.. కొంతకాలంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్న విషయం విదితమే.. అయితే, కొన్నిరోజులుగా ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతూ వచ్చింది.. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరనున్నారనే చర్చ జోరుగా సాగింది.. దానికి అనుగుణంగా ఈ రోజు ఢిల్లీలో చంద్రబాబుతో సమావేశం అయ్యారు శ్రీ కృష్ణదేవరాయలు.
Read Also: Boyapati Srinu: బన్నీతో అనుకుంటే బాలయ్యతోనే సెట్ చేశావా?
మరోవైపు.. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో వెలసిన ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు ఫ్లెక్సీలు వెలిశాయి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. టీడీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.. ఢిల్లీలో చంద్రబాబును ఎంపీ కలవగా.. అదే సమయంలో పట్టణంలో ఫ్లెక్సీల ఏర్పాటు అయ్యాయి.. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అభిమానులు.. అయితే, లావు శ్రీ కృష్ణదేవరాయలకు టీడీపీ ఏ సీటు కేటాయిస్తుంది అనేది తేలాల్సి ఉంది.
తాజావార్తలు
-
US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!