Xiaomi: దిగొచ్చిన చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ.. సరసమైన ధరలో 5G మొబైల్ ప్రైస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా స్మార్టఫోన్ తయారీదారులపై కొనసాగుతున్న ఒత్తిడి నేపథ్యంలో చైనా కంపెనీ షావోమి సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో, చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ షావోమి సప్లయిర్ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ శివార్లలో భారీ ఫ్యాక్టరీని నిర్మించేందుకు రెడీ అవుతుంది. దీంతో ఐఫోన్ తయారీ దారు తైవాన్ కంపెనీ ఫాక్స్కాన్కు పోటీగా డిక్సన్కు షావోమి భాగస్వామ్యం మరింత బలపడతాయని అంచనా. అయితే, వైరల్ గా మారిన ఈ వార్తలపై అటు షావోమి గానీ, డిక్సన్గానీ అధికారికంగా ప్రకటించలేదు.
Also Read
- Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
- Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఫ్యాక్టరీలో డిక్సన్ మూడు సంవత్సరాలలో 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టనుంది. ప్రధానంగా ఇక్కడ షావోమి స్మార్ట్ఫోన్లను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్లాంట్ను ఈ నెలాఖరులో ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే షావోమీ గతంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న బ్లూటూత్ నెక్బ్యాండ్ ఇయర్ ఫోన్లను తయారు చేయడానికి దేశీయ ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకుంది. ఇవి గతంలో చైనా నుంచి దిగుమతి అయ్యేవి.. డిక్సన్ వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీ.. మోటరోలా, శాంసంగ్ లాంటి బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్ సెట్లతో సహా ఇతర ఉత్పత్తులను త్వరగా తయారు చేస్తుంది. మూడు దశాబ్దాల క్రితం ఢిల్లీ శివార్లలో సునీల్ వచాని డిక్సన్ కంపెనీను స్టార్ట్ చేశారు.
Read Also: Shrikanth Iyyangar: ఏంటీ పెళ్లి పిచ్చి.. మొన్న ఆమె, ఇప్పుడీమె?
కాగా, ఇండియా స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఒకపుడు టాప్లో దూసుకుపోయిన.. షావోమి భారత కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, నియంత్రణలతో మార్కెట్లో భారీ నష్టాలను చూసింది. దీని నుంచి కోలుకునేందుకు.. తీసుకున్న చర్యల్లో భాగంగా మేడిన్ ఇండియా 5జీ స్మార్ట్ఫోన్లను సరసమైన ధరలో అందించేందుకు షావోమీ ప్లాన్ చేస్తోంది.
Leadership of @XiaomiIndia met me tdy – hv set out to them our expectations of thm increasing exports, deepening supply chain eco-system n value addition in India n all products to be data privacy compliant @PMOIndia @GoI_MeitY pic.twitter.com/Y8E1YXnOxv
— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) July 6, 2022
తాజావార్తలు
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!