Xiaomi: దిగొచ్చిన చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ.. సరసమైన ధరలో 5G మొబైల్ ప్రైస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా స్మార్టఫోన్ తయారీదారులపై కొనసాగుతున్న ఒత్తిడి నేపథ్యంలో చైనా కంపెనీ షావోమి సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో, చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ షావోమి సప్లయిర్ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ శివార్లలో భారీ ఫ్యాక్టరీని నిర్మించేందుకు రెడీ అవుతుంది. దీంతో ఐఫోన్ తయారీ దారు తైవాన్ కంపెనీ ఫాక్స్కాన్కు పోటీగా డిక్సన్కు షావోమి భాగస్వామ్యం మరింత బలపడతాయని అంచనా. అయితే, వైరల్ గా మారిన ఈ వార్తలపై అటు షావోమి గానీ, డిక్సన్గానీ అధికారికంగా ప్రకటించలేదు.
Also Read
బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఫ్యాక్టరీలో డిక్సన్ మూడు సంవత్సరాలలో 400 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టనుంది. ప్రధానంగా ఇక్కడ షావోమి స్మార్ట్ఫోన్లను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్లాంట్ను ఈ నెలాఖరులో ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే షావోమీ గతంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న బ్లూటూత్ నెక్బ్యాండ్ ఇయర్ ఫోన్లను తయారు చేయడానికి దేశీయ ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకుంది. ఇవి గతంలో చైనా నుంచి దిగుమతి అయ్యేవి.. డిక్సన్ వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీ.. మోటరోలా, శాంసంగ్ లాంటి బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్ సెట్లతో సహా ఇతర ఉత్పత్తులను త్వరగా తయారు చేస్తుంది. మూడు దశాబ్దాల క్రితం ఢిల్లీ శివార్లలో సునీల్ వచాని డిక్సన్ కంపెనీను స్టార్ట్ చేశారు.
Read Also: Shrikanth Iyyangar: ఏంటీ పెళ్లి పిచ్చి.. మొన్న ఆమె, ఇప్పుడీమె?
కాగా, ఇండియా స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఒకపుడు టాప్లో దూసుకుపోయిన.. షావోమి భారత కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, నియంత్రణలతో మార్కెట్లో భారీ నష్టాలను చూసింది. దీని నుంచి కోలుకునేందుకు.. తీసుకున్న చర్యల్లో భాగంగా మేడిన్ ఇండియా 5జీ స్మార్ట్ఫోన్లను సరసమైన ధరలో అందించేందుకు షావోమీ ప్లాన్ చేస్తోంది.
Leadership of @XiaomiIndia met me tdy – hv set out to them our expectations of thm increasing exports, deepening supply chain eco-system n value addition in India n all products to be data privacy compliant @PMOIndia @GoI_MeitY pic.twitter.com/Y8E1YXnOxv
— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) July 6, 2022
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!