Team India: నాకు ఆడాలని అస్సలు లేదు.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న టీమిండియా కీపర్!
- క్రికెట్కు వీడ్కోలు పలికిన వృద్ధిమాన్ సాహా
- రంజీ ట్రోఫీ 2024 చివరిది
- చివరిసారిగా బెంగాల్ తరఫున బరిలోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో ఆడటమూ కష్టమేనని ప్రకటించిన 40 ఏళ్ల సాహా.. రంజీ ట్రోఫీ 2024 తనకు చివరిదని చెప్పాడు. తాజాగా సాహా వీడ్కోలు గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. గతేడాదే రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకున్నానని, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో మాట్లాడిన అనంతరం తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపాడు. గతేడాదే క్రికెట్ను ఆస్వాదించడం ఆపేశానని చెప్పుకొచ్చాడు. క్రిక్బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాహా పలు విషయాలపై స్పందించాడు.
‘నిజానికి నాకు రంజీ సీజన్ 2024 ఆడాలని అస్సలు లేదు. సౌరవ్ గంగూలీ, నా భార్య ఆడాలని పట్టుబట్టారు. చివరిసారిగా బెంగాల్ తరఫున బరిలోకి దిగమని సూచించారు. సొంత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఎప్పుడూ సంతోషమే. దాదాతో సంభాషణ నా మనస్సును మార్చింది. గతేడాది నా శరీరం పెద్దగా సహకరించలేదు. దాంతో క్రికెట్ ఆడేందుకు కష్టంగా అనిపించింది. మరోవైపు గాయాలు కూడా ఇబ్బంది పెట్టాయి. దీంతో అతికష్టంగా గతేడాది సీజన్ను ఆడాను. అయినా సీజన్ మొత్తం ఆడలేకపోయా. ఈ ఏడాది పూర్తి సీజన్ ఆడాలని నిర్ణయించుకున్నా. బెంగాల్ క్వాలిఫై అయితే.. సీజన్ మొత్తం ఆడతా. ఈడెన్ గార్డెన్స్లో నా చివరి మ్యాచ్ ఆడేందు ప్రయత్నిస్తా’ అని సాహా చెప్పాడు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
Also Read: Viral Video: గల్లీ క్రికెట్ మాదిరి.. అలిగి మైదానం వీడిన వెస్టిండీస్ బౌలర్ (వీడియో)!
‘దేశవాళీ క్రికెట్లో యువ క్రికెటర్లతో కలిసి ఆడాను. రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్లో ఆడా. అంతర్జాతీయ క్రికెట్లో ఇటీవల అవకాశాలు రాలేదనే బాధ నాకు లేదు. ఎందుకంటే.. క్రికెట్ అంటే ఇష్టంతో ఆడాను. గతేడాది మాత్రం ఆటను ఆస్వాదించలేకపోయా. అప్పుడే క్రికెట్ను వదిలేయాలని నిర్ణయం తీసుకున్నా. ఈ రంజీ సీజన్ తర్వాత క్రికెట్ ఆడటం ఆపేస్తా. ఇక జీవితంలో ముందుగు సాగాలి’ అని సాహా పేర్కొన్నాడు. భారత్ తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడిన అతడు మొత్తంగా 1300లకు పైగా పరుగులు చేశాడు. 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సాహా.. చివరిసారిగా 2021లో టెస్టు ఆడాడు.
తాజావార్తలు
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..