Team India: నాకు ఆడాలని అస్సలు లేదు.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న టీమిండియా కీపర్!
- క్రికెట్కు వీడ్కోలు పలికిన వృద్ధిమాన్ సాహా
- రంజీ ట్రోఫీ 2024 చివరిది
- చివరిసారిగా బెంగాల్ తరఫున బరిలోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్లో ఆడటమూ కష్టమేనని ప్రకటించిన 40 ఏళ్ల సాహా.. రంజీ ట్రోఫీ 2024 తనకు చివరిదని చెప్పాడు. తాజాగా సాహా వీడ్కోలు గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. గతేడాదే రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకున్నానని, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో మాట్లాడిన అనంతరం తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపాడు. గతేడాదే క్రికెట్ను ఆస్వాదించడం ఆపేశానని చెప్పుకొచ్చాడు. క్రిక్బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాహా పలు విషయాలపై స్పందించాడు.
‘నిజానికి నాకు రంజీ సీజన్ 2024 ఆడాలని అస్సలు లేదు. సౌరవ్ గంగూలీ, నా భార్య ఆడాలని పట్టుబట్టారు. చివరిసారిగా బెంగాల్ తరఫున బరిలోకి దిగమని సూచించారు. సొంత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఎప్పుడూ సంతోషమే. దాదాతో సంభాషణ నా మనస్సును మార్చింది. గతేడాది నా శరీరం పెద్దగా సహకరించలేదు. దాంతో క్రికెట్ ఆడేందుకు కష్టంగా అనిపించింది. మరోవైపు గాయాలు కూడా ఇబ్బంది పెట్టాయి. దీంతో అతికష్టంగా గతేడాది సీజన్ను ఆడాను. అయినా సీజన్ మొత్తం ఆడలేకపోయా. ఈ ఏడాది పూర్తి సీజన్ ఆడాలని నిర్ణయించుకున్నా. బెంగాల్ క్వాలిఫై అయితే.. సీజన్ మొత్తం ఆడతా. ఈడెన్ గార్డెన్స్లో నా చివరి మ్యాచ్ ఆడేందు ప్రయత్నిస్తా’ అని సాహా చెప్పాడు.
Also Read
- Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
- Ajinkya Rahane: "ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే".. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
- Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
Also Read: Viral Video: గల్లీ క్రికెట్ మాదిరి.. అలిగి మైదానం వీడిన వెస్టిండీస్ బౌలర్ (వీడియో)!
‘దేశవాళీ క్రికెట్లో యువ క్రికెటర్లతో కలిసి ఆడాను. రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్లో ఆడా. అంతర్జాతీయ క్రికెట్లో ఇటీవల అవకాశాలు రాలేదనే బాధ నాకు లేదు. ఎందుకంటే.. క్రికెట్ అంటే ఇష్టంతో ఆడాను. గతేడాది మాత్రం ఆటను ఆస్వాదించలేకపోయా. అప్పుడే క్రికెట్ను వదిలేయాలని నిర్ణయం తీసుకున్నా. ఈ రంజీ సీజన్ తర్వాత క్రికెట్ ఆడటం ఆపేస్తా. ఇక జీవితంలో ముందుగు సాగాలి’ అని సాహా పేర్కొన్నాడు. భారత్ తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడిన అతడు మొత్తంగా 1300లకు పైగా పరుగులు చేశాడు. 2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సాహా.. చివరిసారిగా 2021లో టెస్టు ఆడాడు.
తాజావార్తలు
-
Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!