World Population: 8 బిలియన్లకు ప్రపంచ జనాభా.. చైనాను అధిగమించనున్న భారత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Population: నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా స్థానంలో భారత్ అవతరించనుందని నివేదికలో పేర్కొంది. ప్రపంచ జనాభా మంగళవారం నాటికి 8 బిలియన్ల మందికి చేరుకుంటుందని అంచనా. 2030లో ప్రపంచ జనాభా 8.5 బిలియన్లకు, 2050లో 9.7 బిలియన్లకు, 2100లో 10.4 బిలియన్లకు పెరగవచ్చని ఐక్యరాజ్యసమితి తాజా అంచనాలు సూచిస్తున్నాయి. ఈ సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన యూఎన్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022లో ఈ ప్రొజెక్షన్ వెల్లడైంది, అయితే అంచనా వేసిన గడువు కొద్ది రోజులు మాత్రమే ఉంది. 1950 తర్వాత తొలిసారిగా 2020లో ప్రపంచ జనాభా పెరుగుదల ఒక శాతం కంటే తక్కువగా పడిపోయిందని ఈ నివేదిక వెల్లడించింది.
ప్రపంచ జనాభా 7 నుంచి 8 బిలియన్లకు పెరగడానికి 12 సంవత్సరాలు పట్టింది. ఇది 9 బిలియన్లకు చేరుకోవడానికి సుమారు 15 సంవత్సరాలు పడుతుంది. 2037 వరకు ప్రపంచ జనాభా మొత్తం వృద్ధి రేటు మందగిస్తుందని నివేదికలు పేర్కొంటున్నాయి. 2022లో రెండు అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలు ఆసియాలో ఉన్నాయి. తూర్పు, ఆగ్నేయ ఆసియా 2.3 బిలియన్ల జనాభా, మధ్య, దక్షిణ ఆసియా 2.1 బిలియన్లతో అత్యధిక జనాభాను కలిగి ఉన్నాయి. చైనా, భారతదేశాలు ఒక్కొక్కటి 1.4 బిలియన్ల కంటే ఎక్కువ ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి.
Also Read
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
2050 వరకు అంచనా వేసిన ప్రపంచ జనాభాలో సగానికి పైగా పెరుగుదల కేవలం ఎనిమిది దేశాల్లోనే కేంద్రీకృతమై ఉంటుంది. ఆ దేశాలు కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా. యూఎన్ అంచనాల ప్రకారం, 2023 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం చైనాను అధిగమిస్తుందని అంచనా వేయబడింది.జనన సమయంలో పెరిగిన ఆయుర్దాయం స్థాయిలలో ప్రతిబింబించే విధంగా, మరణాల స్థాయిలు తగ్గడం వల్ల జనాభా పెరుగుదల కొంతవరకు సంభవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2019లో ఆయుర్దాయం 72.8 సంవత్సరాలకు చేరుకుంది. మరణాలలో మరింత తగ్గింపుల ఫలితంగా 2050లో ప్రపంచవ్యాప్తంగా సగటు దీర్ఘాయువు 77.2 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేయబడింది.
Joe Biden Meets Xi Jinping: జీ జిన్పింగ్, జో బైడెన్ భేటీ.. ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన వీడేనా?
అత్యధిక సంతానోత్పత్తి స్థాయిలు కలిగిన దేశాలు తలసరి అత్యల్ప ఆదాయం కలిగిన దేశాలు. అందువల్ల ప్రపంచ జనాభా పెరుగుదల కాలక్రమేణా ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో కేంద్రీకృతమై ఉంది, వీటిలో ఎక్కువ భాగం సబ్-సహారా ఆఫ్రికాలో ఉన్నాయి. ఈ దేశాలలో, స్థిరమైన వేగవంతమైన జనాభా పెరుగుదల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (SDGలు) సాధించడాన్ని అడ్డుకుంటుంది. ఎక్కువగా సహజన వనరులు వినియోగించుకుంటున్న దేశాలు, గ్రీన్హౌస్ ఉద్గారాల అత్యధిక తలసరి వినియోగం ఉన్న దేశాల్లో ఎక్కువ తలసరి ఆదాయం ఉండడంతో పాటు తక్కువ జనాభాను కలిగి ఉన్నాయి. అయినప్పటికీ, అనేక దశాబ్దాలుగా మందగించిన జనాభా పెరుగుదల ప్రస్తుత శతాబ్దపు ద్వితీయార్ధంలో పర్యావరణ నష్టాన్ని మరింత తగ్గించడంలో సహాయపడుతుంది.
తాజావార్తలు
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
-
West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
-
Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
-
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!