World Population: 8 బిలియన్లకు ప్రపంచ జనాభా.. చైనాను అధిగమించనున్న భారత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Population: నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా స్థానంలో భారత్ అవతరించనుందని నివేదికలో పేర్కొంది. ప్రపంచ జనాభా మంగళవారం నాటికి 8 బిలియన్ల మందికి చేరుకుంటుందని అంచనా. 2030లో ప్రపంచ జనాభా 8.5 బిలియన్లకు, 2050లో 9.7 బిలియన్లకు, 2100లో 10.4 బిలియన్లకు పెరగవచ్చని ఐక్యరాజ్యసమితి తాజా అంచనాలు సూచిస్తున్నాయి. ఈ సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన యూఎన్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022లో ఈ ప్రొజెక్షన్ వెల్లడైంది, అయితే అంచనా వేసిన గడువు కొద్ది రోజులు మాత్రమే ఉంది. 1950 తర్వాత తొలిసారిగా 2020లో ప్రపంచ జనాభా పెరుగుదల ఒక శాతం కంటే తక్కువగా పడిపోయిందని ఈ నివేదిక వెల్లడించింది.
ప్రపంచ జనాభా 7 నుంచి 8 బిలియన్లకు పెరగడానికి 12 సంవత్సరాలు పట్టింది. ఇది 9 బిలియన్లకు చేరుకోవడానికి సుమారు 15 సంవత్సరాలు పడుతుంది. 2037 వరకు ప్రపంచ జనాభా మొత్తం వృద్ధి రేటు మందగిస్తుందని నివేదికలు పేర్కొంటున్నాయి. 2022లో రెండు అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలు ఆసియాలో ఉన్నాయి. తూర్పు, ఆగ్నేయ ఆసియా 2.3 బిలియన్ల జనాభా, మధ్య, దక్షిణ ఆసియా 2.1 బిలియన్లతో అత్యధిక జనాభాను కలిగి ఉన్నాయి. చైనా, భారతదేశాలు ఒక్కొక్కటి 1.4 బిలియన్ల కంటే ఎక్కువ ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి.
Also Read
2050 వరకు అంచనా వేసిన ప్రపంచ జనాభాలో సగానికి పైగా పెరుగుదల కేవలం ఎనిమిది దేశాల్లోనే కేంద్రీకృతమై ఉంటుంది. ఆ దేశాలు కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా. యూఎన్ అంచనాల ప్రకారం, 2023 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం చైనాను అధిగమిస్తుందని అంచనా వేయబడింది.జనన సమయంలో పెరిగిన ఆయుర్దాయం స్థాయిలలో ప్రతిబింబించే విధంగా, మరణాల స్థాయిలు తగ్గడం వల్ల జనాభా పెరుగుదల కొంతవరకు సంభవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 2019లో ఆయుర్దాయం 72.8 సంవత్సరాలకు చేరుకుంది. మరణాలలో మరింత తగ్గింపుల ఫలితంగా 2050లో ప్రపంచవ్యాప్తంగా సగటు దీర్ఘాయువు 77.2 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేయబడింది.
Joe Biden Meets Xi Jinping: జీ జిన్పింగ్, జో బైడెన్ భేటీ.. ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన వీడేనా?
అత్యధిక సంతానోత్పత్తి స్థాయిలు కలిగిన దేశాలు తలసరి అత్యల్ప ఆదాయం కలిగిన దేశాలు. అందువల్ల ప్రపంచ జనాభా పెరుగుదల కాలక్రమేణా ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో కేంద్రీకృతమై ఉంది, వీటిలో ఎక్కువ భాగం సబ్-సహారా ఆఫ్రికాలో ఉన్నాయి. ఈ దేశాలలో, స్థిరమైన వేగవంతమైన జనాభా పెరుగుదల సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (SDGలు) సాధించడాన్ని అడ్డుకుంటుంది. ఎక్కువగా సహజన వనరులు వినియోగించుకుంటున్న దేశాలు, గ్రీన్హౌస్ ఉద్గారాల అత్యధిక తలసరి వినియోగం ఉన్న దేశాల్లో ఎక్కువ తలసరి ఆదాయం ఉండడంతో పాటు తక్కువ జనాభాను కలిగి ఉన్నాయి. అయినప్పటికీ, అనేక దశాబ్దాలుగా మందగించిన జనాభా పెరుగుదల ప్రస్తుత శతాబ్దపు ద్వితీయార్ధంలో పర్యావరణ నష్టాన్ని మరింత తగ్గించడంలో సహాయపడుతుంది.
తాజావార్తలు
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!