Joe Biden Meets Xi Jinping: జీ జిన్పింగ్, జో బైడెన్ భేటీ.. ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన వీడేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Biden Meets Xi Jinping: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్లు సోమవారం ఇండోనేషియాలోని బాలిలో సమావేశమయ్యారు. అమెరికా, చైనా దేశాల మధ్య ఆర్థిక, భద్రతాపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్నేళ్లగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తైవాన్ అంశంతో పాటు కరోనా వైరస్ వెలుగు చూసిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామాల నడుమ అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పగ్గాలు చేపట్టిన తర్వాత జిన్పింగ్తో సమావేశం అవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇండోనేషియాలో జరుగుతున్న జీ-20 సదస్సులో భాగంగా ఇరు దేశాధినేతలు కరచాలనం చేస్తూ ఒకరినొకరు పలకరించుకున్నారు.
ఈ భేటీ ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభిప్రాయపడ్డారు. ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుందామని జిన్పింగ్తో జో బైడెన్ చెప్పారు. దీనికి స్పందించిన జిన్పింగ్.. ఇటువంటి చర్చలు మరిన్ని జరగాలని సూచించగా, అందుకు దారులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని బైడెన్ చెప్పారు. తద్వారా వాతావరణ మార్పులు, విపత్తుల వంటి అంతర్జాతీయ సవాళ్లపై కలిసి పనిచేయవచ్చని బైడెన్ సూచించారని అమెరికా అధికారులు తెలిపారు. ఇరుదేశాలు కలిసి ప్రపంచ సమస్యలపై కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు. జిన్పింగ్తో నిజాయితీగా తన అభిప్రాయాలను తెలిపేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈ భేటీలో అధ్యక్షులతోపాటు ఇరుదేశాల విదేశాంగ మంత్రులు, రాయబారులు పాల్గొన్నారు.
Also Read
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
- Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
- YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
- PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
G20 Summit: రెండు రోజుల పాటు జీ20 సమావేశాలు.. బాలిలో ప్రధానికి ఘనస్వాగతం
చైనా, అమెరికా దేశాధినేతల మధ్య జరుగుతున్న అత్యున్నత స్థాయి భేటీపై ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోందని జిన్పింగ్ అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుంటామని తెలిపారు. చైనా-యూఎస్ మధ్య తలెత్తిన విబేధాలను పరిష్కరించుకునే బాధ్యత ఇరుదేశాలపై ఉందని పేర్కొన్నారు. పరస్పర సహకారం కోసం అనువైన మార్గాలను అన్వేషిస్తున్నన్నట్లు ఆయన తెలిపారు. బైడెన్తో అన్నివిషయాలపై లోతుగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాని జిన్పింగ్ చెప్పారు. ఈ భేటీకి ముందు మాట్లాడిన జో బైడెన్.. చైనాతో ఘర్షణ పడాలనే ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ఆ దేశంతో పోటీ పడాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని, ఉద్రిక్తతలు నివారించటానికి తమవైపు నుంచి సమాచార వ్యవస్థలన్నింటినీ తెరిచే ఉంచుతామని ఆదివారం తూర్పు ఆసియా సదస్సులో మాట్లాడుతూ జో బైడెన్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
-
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..