Champions League T20 : మళ్ళీ రాబోతున్న టీ20 ఛాంపియన్స్ లీగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్స్ దర్శనమిస్తున్నాయి. ఐపీఎల్ సక్సెస్ తరువాత దాదాపు ప్రతి దేశం ఈ లీగ్స్ ని జరుపుతున్నాయి. ఇక ఇండియాలో అయితే ప్రతి స్టేట్, వాళ్ళ ప్లేయర్లను పరిచయం చేయటానికి లీగ్స్ నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్స్ ఏకంగా 25 పైనే ఉన్నాయి. అయితే ఒక్కప్పుడు టీ20 ఛాంపియన్స్ లీగ్ అనే ఒక లీగ్ ఉండేది. అది కేవలం ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, ఇంగ్లాండ్ కౌంటీల్లో టాప్ 2 టీమ్స్ అంటే విన్నర్, రన్నర్స్ మాత్రమే ఆడేవి. ఇలా T20 లీగుల్లో టాప్ 2 టీమ్స్ ఆడేవి. కానీ ఆ తర్వాత ఈ లీగ్ ను నిర్వహించటం ఆపేశారు. దీనికి కారణం, ప్రతి టీం విదేశీ టూర్లతో బిజీగా మారిపోవడంతో పాటు ఐపీఎల్ డామినేషన్ పెరగడం. ఇక చివరగా ఈ లీగ్ 2014లో జరిగింది. ఆ తరువాత ఈ లీగ్ నిర్వహించటానికి సాధ్యపడలేదు. అయితే ఇప్పుడు ఇదే లీగ్ మళ్ళీ నిర్వహించటానికి ప్లాన్ చేస్తున్నారు.
READ MORE: Shocking : చిన్నారి వాంతిలో కదులుతున్న పరుగులు.. నెలరోజులుగా ఇదే తంతు
Also Read
- Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
- Vladimir Putin: "మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు".. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
- Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
వరల్డ్ క్లబ్ T20 ఛాంపియన్షిప్ పేరిట ఒక లీగ్ ను 2026 నుంచి నిర్వహించబోతున్నారు. ఇందులో ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, ది హండ్రెడ్, SA T20 లీగ్స్ లో ఛాంపియన్స్ గా నిలిచిన జట్లు తలపడతాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 20 లీగ్స్ నుంచి Title విన్నర్ జట్లను తీసుకుంటారు. వారందరూ ఇక్కడ మరోసారి తలపడతారు. ఇప్పటివరకు డొమెస్టిక్ స్థాయిలో ఉన్న టాలెంటును గ్లోబల్ స్టేజి మీద ప్రదర్శించటానికి మంచి వేదిక అవుతుంది. ఇక ఈ విషయంపై ఇప్పటికే బీసీసీఐ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్, ఐసీసీ ఛైర్మెన్ జైషా దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లీగ్ పై అన్ని పాజిటివ్ గానే కనపడుతున్నాయి. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ ఇకపై హండ్రెడ్ లీగ్ లో విన్నర్ గా నిలిచిన జట్టునే పంపనుంది. అంతకుముందు ఛాంపియన్స్ లీగ్ టైంలో T20 బ్లాస్ట్ టైటిల్ విన్నర్ జట్టునే పంపేవారు. అయితే ఇప్పుడు ఆ జట్లను కాకుండా హండ్రెడ్ లీగ్ టైటిల్ విజేతను పంపనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు మొదటిసారిగా ఛాంపియన్స్ గా అవతరించినట్లు తెలిసిందే.
కాగా.. మొదట 2009లో ప్రారంభమైన చాంపియన్స్ లీగ్, 2014 వరకు నడిచింది. అయితే 2015లో టెలివిజన్ రేటింగులు తక్కువగా ఉండటం, స్పాన్సర్షిప్ స్ట్రగుల్స్ (sponsorship struggles) కారణంగా ఈ లీగ్ ను రద్దు చేశారు. ఇక ఈ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ రెండు టైటిళ్లతో అత్యంత విజయవంతమైన జట్లుగా కూడా నిలిచాయి.
READ MORE: Thummala Nageswara Rao: రాష్ట్రంలో యూరియా కొరత.. మరోమారు కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల..!
తాజావార్తలు
-
Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్.. 5,200mAh బ్యాటరీ, ధర రూ. 10,000 లోపే..!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే, పండగే ఇవాళ!
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!