Champions League T20 : మళ్ళీ రాబోతున్న టీ20 ఛాంపియన్స్ లీగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా T20 లీగ్స్ దర్శనమిస్తున్నాయి. ఐపీఎల్ సక్సెస్ తరువాత దాదాపు ప్రతి దేశం ఈ లీగ్స్ ని జరుపుతున్నాయి. ఇక ఇండియాలో అయితే ప్రతి స్టేట్, వాళ్ళ ప్లేయర్లను పరిచయం చేయటానికి లీగ్స్ నిర్వహిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్స్ ఏకంగా 25 పైనే ఉన్నాయి. అయితే ఒక్కప్పుడు టీ20 ఛాంపియన్స్ లీగ్ అనే ఒక లీగ్ ఉండేది. అది కేవలం ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, ఇంగ్లాండ్ కౌంటీల్లో టాప్ 2 టీమ్స్ అంటే విన్నర్, రన్నర్స్ మాత్రమే ఆడేవి. ఇలా T20 లీగుల్లో టాప్ 2 టీమ్స్ ఆడేవి. కానీ ఆ తర్వాత ఈ లీగ్ ను నిర్వహించటం ఆపేశారు. దీనికి కారణం, ప్రతి టీం విదేశీ టూర్లతో బిజీగా మారిపోవడంతో పాటు ఐపీఎల్ డామినేషన్ పెరగడం. ఇక చివరగా ఈ లీగ్ 2014లో జరిగింది. ఆ తరువాత ఈ లీగ్ నిర్వహించటానికి సాధ్యపడలేదు. అయితే ఇప్పుడు ఇదే లీగ్ మళ్ళీ నిర్వహించటానికి ప్లాన్ చేస్తున్నారు.
READ MORE: Shocking : చిన్నారి వాంతిలో కదులుతున్న పరుగులు.. నెలరోజులుగా ఇదే తంతు
Also Read
- Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
- PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
- Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
- Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్తో కీలక భేటీలు!
వరల్డ్ క్లబ్ T20 ఛాంపియన్షిప్ పేరిట ఒక లీగ్ ను 2026 నుంచి నిర్వహించబోతున్నారు. ఇందులో ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, ది హండ్రెడ్, SA T20 లీగ్స్ లో ఛాంపియన్స్ గా నిలిచిన జట్లు తలపడతాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 20 లీగ్స్ నుంచి Title విన్నర్ జట్లను తీసుకుంటారు. వారందరూ ఇక్కడ మరోసారి తలపడతారు. ఇప్పటివరకు డొమెస్టిక్ స్థాయిలో ఉన్న టాలెంటును గ్లోబల్ స్టేజి మీద ప్రదర్శించటానికి మంచి వేదిక అవుతుంది. ఇక ఈ విషయంపై ఇప్పటికే బీసీసీఐ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్, ఐసీసీ ఛైర్మెన్ జైషా దగ్గర ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లీగ్ పై అన్ని పాజిటివ్ గానే కనపడుతున్నాయి. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ ఇకపై హండ్రెడ్ లీగ్ లో విన్నర్ గా నిలిచిన జట్టునే పంపనుంది. అంతకుముందు ఛాంపియన్స్ లీగ్ టైంలో T20 బ్లాస్ట్ టైటిల్ విన్నర్ జట్టునే పంపేవారు. అయితే ఇప్పుడు ఆ జట్లను కాకుండా హండ్రెడ్ లీగ్ టైటిల్ విజేతను పంపనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు మొదటిసారిగా ఛాంపియన్స్ గా అవతరించినట్లు తెలిసిందే.
కాగా.. మొదట 2009లో ప్రారంభమైన చాంపియన్స్ లీగ్, 2014 వరకు నడిచింది. అయితే 2015లో టెలివిజన్ రేటింగులు తక్కువగా ఉండటం, స్పాన్సర్షిప్ స్ట్రగుల్స్ (sponsorship struggles) కారణంగా ఈ లీగ్ ను రద్దు చేశారు. ఇక ఈ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ రెండు టైటిళ్లతో అత్యంత విజయవంతమైన జట్లుగా కూడా నిలిచాయి.
READ MORE: Thummala Nageswara Rao: రాష్ట్రంలో యూరియా కొరత.. మరోమారు కేంద్రానికి లేఖ రాసిన మంత్రి తుమ్మల..!
తాజావార్తలు
-
Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
-
Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
-
Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..
-
Rajat Patidar-RCB: మేం గెలవడానికి అర్హులం కాదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ షాకింగ్ కామెంట్స్!
-
Prabhas: సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట రచ్చ అవుతున్న కామెంట్స్!
ట్రెండింగ్
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత