Shocking : చిన్నారి వాంతిలో కదులుతున్న పురుగులు.. నెలరోజులుగా ఇదే తంతు
- చిన్నారి వాంతిలో పురుగులు… షాక్కి గురైన డాక్టర్లు!
- వాంతిలో కదులుతున్న జీవాలు
- నెలరోజులుగా ఇదే తంతు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking : ఈ ప్రపంచంలో రోజుకో కొత్తరకమైన, విచిత్రమైన వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. వైద్య శాస్త్రాన్ని, నిపుణులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసే ఈ కొత్త కేసులు ఎంతగానో కలవరపెడుతున్నాయి. అలాంటి ఘటనే తాజాగా చైనాలో చోటుచేసుకుంది. ఇది ఏ కథనమో కాదు.. నిజంగా నోటికొచ్చే నమ్మలేని వార్తే..!
పూర్వ చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లో ఉన్న యాంగ్ఝౌ నగరానికి చెందిన 8 ఏళ్ల బాలిక శరీరంలో నెలరోజులుగా ఓ విచిత్రమైన సంఘటన జరుగుతోంది. ఆ చిన్నారి ఎప్పటికప్పుడు వాంతి చేస్తూ, వాటిలో జీవించి ఉన్న చిన్న చిన్న పురుగులు బయటకు వస్తుండటంతో తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. చివరికి ఈ సంఘటన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనంగా ప్రచురించింది.
Also Read
ఆ బాలిక తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి వాంతిలోనూ సుమారు ఒక సెంటీమీటర్ పొడవున్న, వేళ్లంత చిన్న జీవులు కనిపించాయి. స్థానిక డాక్టర్లు శరీరం పరీక్షించినా, ఈ లక్షణాలకు సరిపడే వ్యాధిని గుర్తించలేకపోయారు. చివరికి చిన్నారిని సుఝౌ విశ్వవిద్యాలయానికి చెందిన పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడి వైద్యురాలు డా. జాంగ్ బింగ్బింగ్ ఓ సంచలన నిజాన్ని వెల్లడించారు.
ENG vs IND: మూడు కీలక మార్పులు చేసిన టీమిండియా.. ఈసారైనా విజయం వరిస్తుందా..?
ఆ బాలిక వాంతుల్లో ఉన్న జీవులను పరీక్షించిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ఇది ‘డ్రైన్ ఫ్లై లార్వా’ (Drain Fly Larvae) అని నిర్ధారించింది. దీన్ని “మాథ్ ఫ్లై” అని కూడా పిలుస్తారు. ఇవి ఎక్కువగా చీకటి, తేమ ఉన్న ప్రాంతాల్లో.. ముఖ్యంగా బాత్రూంలు, చెరువులు, అండర్గ్రౌండ్ డ్రైన్లు వంటి చోట్ల ఎక్కువగా ఉంటాయి. చైనాలో వేసవిలో ఇవి విస్తృతంగా వ్యాపిస్తాయి.
ఈ విషయం తెలిసిన వెంటనే బాలిక తల్లిదండ్రులు “ఇలాంటి చిన్న జంతువులను మా ఇంట్లో చూసాం కానీ, అవి ఇంత ప్రమాదకరంగా ఉంటాయని అస్సలు ఊహించలేదు” అని వాపోయారు.
కానీ ఆ పురుగులు బాలిక శరీరంలోకి ఎలా ప్రవేశించాయో విషయానికి వస్తే, యాంగ్జౌ CDC విభాగం చీఫ్ జు యుహుయ్ మాట్లాడుతూ, కలుషితమైన నీటి ద్వారా పురుగులు బాలిక శరీరంలోకి ప్రవేశించి ఉండవచ్చని అన్నారు. బాలిక పళ్ళు తోముకున్నప్పుడు లేదా టాయిలెట్ ఫ్లష్ చేసినప్పుడు, నీటి స్ప్రే ద్వారా పురుగులు ఆమె శరీరంలోకి ప్రవేశించి ఉండవచ్చు. ఈ లార్వా రక్తం ద్వారా వ్యాధిని వ్యాపింపజేస్తుంది.
SCMP నివేదిక ప్రకారం.. మురుగు పురుగులను ఒట్టి చేతులతో తాకకూడదు, ఎందుకంటే అవి మోసుకెళ్ళే బ్యాక్టీరియా కళ్ళు లేదా నోటి ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. బదులుగా, ప్రభావిత కాలువలపై ఉప్పు, బేకింగ్ సోడా కలిపిన వేడి నీటిని పోయడం ద్వారా లార్వాలను తొలగించాలని సిఫార్సు చేయబడింది.
ఈ సంఘటన మనందరికీ కూడా ఒక హెచ్చరికే. మన ఇళ్లలో కనిపించే చిన్న కీటకాలకే అర్థం లేని వ్యాధులకు కారణమయ్యే సామర్థ్యం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో అలాంటి పర్యావరణాలను శుభ్రంగా ఉంచడం ఎంత అవసరమో ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది.
Bangladesh: షేక్ హసీనాకు 6 నెలల జైలు శిక్ష.. అంతర్జాతీయ కోర్టు సంచలన తీర్పు..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!