Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. సభలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించినప్పటికీ దానికి తగిన న్యాయం చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ సచివాలయంలో మసీదు నిర్మాణం పరిస్థితి, హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితులను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. హైటెక్ సిటీలో శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నా పాతబస్తీలో మాత్రం అభివృద్ధి జరగకపోవడంపై ఎమ్మెల్యే ప్రశ్నించారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుల పూర్తి తేదీపై కూడా ఆయన వివరణ కోరారు. సీఎం కేసీఆర్, ఇతర మంత్రులను కలవడానికి అనుమతించడం లేదని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపిస్తూ, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కిందిస్థాయి సిబ్బందిని కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలకు, మంత్రి కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు.
Also Read : Revanth Reddy : 2003 నాటి పరిస్థితులు.. ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చింది
Also Read
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నదే ఏడుగురని, వారికి అధిక సమయం కేటాయించరని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై అక్బరుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. ఏడుగురు ఎమ్మెల్యేలే ఉన్నారని కేటీఆర్ అన్నారని, దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, తమ పార్టీ అధినేత అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు అక్బరుద్దీన్. దీనిపై తాను పార్టీ చీఫ్ తో మాట్లాడతానని వెల్లడించారు అక్బరుద్దీన్. ఏడుగురు కాదు కనీసం 15 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యేలా చూస్తామని, ఈసారి మరింతమంది ఎమ్మెల్యేలతో సభలో అడుగుపెడతామని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు.
Also Read : Dadisetti Raja: యనమలకు దాడిశెట్టి సవాల్.. తమ్ముడితో ఆ పని చేయించగలవా?
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
-
School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!