T20 World Cup 2024: టీమిండియాకు గాయల బెడద.. నలుగురు స్టార్ ప్లేయర్స్..!
- అక్టోబరు 3 నుంచి టీ20 ప్రపంచకప్
- న్యూజిలాండ్తో భారత్ తొలి మ్యాచ్
- ఆందోళనలో టీమ్ మెనెజ్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. భారత్ అక్టోబర్ 4న న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరగనుంది. ఇక 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత మహిళల జట్టు ప్రస్తుతం బెంగళూరులోని ఏన్సీఏలో ప్రాక్టీస్ చేస్తోంది. టైటిల్ లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. అయితే భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది.
స్టార్ పేసర్ అరుంధతి రెడ్డి ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె ప్రాక్టీస్ చేయడం లేదు. అయితే ప్రపంచకప్ ఆరంభానికి పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అరుంధతి ఈ మెగా టోర్నీకి దూరం అయితే భారత్కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అరుంధతి ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉంది. స్టార్ ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ కూడా భుజం గాయంతో సతమతమవుతోంది. అయితే పూజా మాత్రం తన ప్రాక్టీస్ను కొనసాగిస్తోంది. టోర్నీ ఆరంభ సమయానికి ఆమె పూర్తి ఫిట్నెస్ సాధించే ఛాన్స్ ఉంది.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
వేలి గాయం కారణంగా ఆసియా కప్కు దూరమైన యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఇంకా కోలుకోలేదు. టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికైనప్పటకీ.. టోర్నీకి అందుబాటులో ఉంటుందా? లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. శ్రేయాంక మెగా ఈవెంట్ ఆడుతుందని మెనెజ్మెంట్ ఆశిస్తోంది. స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కూడా చేతి వేలి గాయంతో బాధపడుతోంది. అయితే జెమిమా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ప్రపంచకప్ సమయానికి కోలుకునే సూచనలు కన్పిస్తున్నాయి. స్టార్ ప్లేయర్లు గాయాలతో బాధపడుతుండడంతో టీమ్ మెనెజ్మెంట్ ఆందోళన చెందుతోంది.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!