T20 World Cup 2024: టీమిండియాకు గాయల బెడద.. నలుగురు స్టార్ ప్లేయర్స్..!
- అక్టోబరు 3 నుంచి టీ20 ప్రపంచకప్
- న్యూజిలాండ్తో భారత్ తొలి మ్యాచ్
- ఆందోళనలో టీమ్ మెనెజ్మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల టీ20 ప్రపంచకప్ 2024 అక్టోబరు 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. భారత్ అక్టోబర్ 4న న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరగనుంది. ఇక 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత మహిళల జట్టు ప్రస్తుతం బెంగళూరులోని ఏన్సీఏలో ప్రాక్టీస్ చేస్తోంది. టైటిల్ లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. అయితే భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది.
స్టార్ పేసర్ అరుంధతి రెడ్డి ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె ప్రాక్టీస్ చేయడం లేదు. అయితే ప్రపంచకప్ ఆరంభానికి పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అరుంధతి ఈ మెగా టోర్నీకి దూరం అయితే భారత్కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అరుంధతి ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉంది. స్టార్ ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్ కూడా భుజం గాయంతో సతమతమవుతోంది. అయితే పూజా మాత్రం తన ప్రాక్టీస్ను కొనసాగిస్తోంది. టోర్నీ ఆరంభ సమయానికి ఆమె పూర్తి ఫిట్నెస్ సాధించే ఛాన్స్ ఉంది.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
వేలి గాయం కారణంగా ఆసియా కప్కు దూరమైన యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ఇంకా కోలుకోలేదు. టీ20 ప్రపంచకప్ 2024కు ఎంపికైనప్పటకీ.. టోర్నీకి అందుబాటులో ఉంటుందా? లేదా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. శ్రేయాంక మెగా ఈవెంట్ ఆడుతుందని మెనెజ్మెంట్ ఆశిస్తోంది. స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కూడా చేతి వేలి గాయంతో బాధపడుతోంది. అయితే జెమిమా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ప్రపంచకప్ సమయానికి కోలుకునే సూచనలు కన్పిస్తున్నాయి. స్టార్ ప్లేయర్లు గాయాలతో బాధపడుతుండడంతో టీమ్ మెనెజ్మెంట్ ఆందోళన చెందుతోంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!