Electric Shock: ఢిల్లీ రైల్వే స్టేషన్లో విషాదం.. విద్యుదాఘాతంతో మహిళ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electric Shock: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరిగే అవకాశం ఉంది. వర్షాలకు విద్యుత్ స్థంబాల నుంచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తాజాగా ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ ఆవరణలో కురుస్తున్న వర్షం కారణంగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షపు నీరు స్టేషన్ ఆవరణలోకి చేరింది. ఆ సమయంలో చండీగఢ్ వెళ్లేందుకు భర్తతో కలిసి ఈరోజు ఉదయం రైల్వే స్టేషన్కు చేరుకున్న సాక్షి అహుజా అనే మహిళ స్టేషన్ ఆవరణలోని విద్యుత్ స్తంభానికి తగిలి విద్యుత్ షాక్కు గురైంది. దాంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లేడీ హార్డింజ్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రైల్వే అధికారుల తీరుపై దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: KCR Maharashtra Tour: రేపు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్.. రెండు రోజుల పర్యటన వివరాలు
Also Read
- Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
- Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
- US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
అసలేం జరిగిందంటే.. సాక్షి అహుజా అనే మహిళ ఆదివారం ఉదయం 5.30 గంటలకు తన సోదరి, ముగ్గురు పిల్లలతో కలిసి భోపాల్కు రైలు ఎక్కేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకుంది. అయితే, స్టేషన్ వెలుపల, ఆమె నీటితో నిండిన రహదారిని దాటుతున్నప్పుడు, ఆమె మద్దతు కోసం విద్యుత్ స్తంభాన్ని పట్టుకుని విద్యుదాఘాతానికి గురైంది.సాక్షి అహుజా అనే మహిళ విద్యుదాఘాతానికి గురై స్పృహతప్పి పడిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు విద్యుత్ స్తంభం నుంచి కొన్ని వైర్లు బయటకు వచ్చాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, విద్యుదాఘాతానికి గురైన మహిళకు సమీపంలోని వ్యక్తులు సహాయం చేయడానికి ప్రయత్నించారు. అనంతరం ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అధికారుల నిర్లక్ష్యంపై మహిళ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యుదాఘాతం ఎలా జరిగిందనే దాని గురించి పోలీసులు మాట్లాడుతూ, ఇన్సులేషన్ వైఫల్యం కారణంగా స్తంభంపై ఉన్న కేబుల్ నుంచి కరెంట్ లీకేజీ ఉందని చెప్పారు. ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందో తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతోంది.
తాజావార్తలు
-
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
-
Health Tips : గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? ఇంటి చిట్కాలను ఇలా ఒక సారి ట్రై చెయ్యండి.!
-
Gaza War: గాజాను స్వాధీనం చేసుకోండి.. సైన్యానికి నెతన్యాహూ ఆదేశం..
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
-
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం.. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపులు
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!