Electric Shock: ఢిల్లీ రైల్వే స్టేషన్లో విషాదం.. విద్యుదాఘాతంతో మహిళ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electric Shock: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరిగే అవకాశం ఉంది. వర్షాలకు విద్యుత్ స్థంబాల నుంచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తాజాగా ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ ఆవరణలో కురుస్తున్న వర్షం కారణంగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షపు నీరు స్టేషన్ ఆవరణలోకి చేరింది. ఆ సమయంలో చండీగఢ్ వెళ్లేందుకు భర్తతో కలిసి ఈరోజు ఉదయం రైల్వే స్టేషన్కు చేరుకున్న సాక్షి అహుజా అనే మహిళ స్టేషన్ ఆవరణలోని విద్యుత్ స్తంభానికి తగిలి విద్యుత్ షాక్కు గురైంది. దాంతో ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లేడీ హార్డింజ్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రైల్వే అధికారుల తీరుపై దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: KCR Maharashtra Tour: రేపు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్.. రెండు రోజుల పర్యటన వివరాలు
Also Read
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
- Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో "మాస్క్ మ్యాన్".. ఎవరనేది తెలిసింది
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
అసలేం జరిగిందంటే.. సాక్షి అహుజా అనే మహిళ ఆదివారం ఉదయం 5.30 గంటలకు తన సోదరి, ముగ్గురు పిల్లలతో కలిసి భోపాల్కు రైలు ఎక్కేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకుంది. అయితే, స్టేషన్ వెలుపల, ఆమె నీటితో నిండిన రహదారిని దాటుతున్నప్పుడు, ఆమె మద్దతు కోసం విద్యుత్ స్తంభాన్ని పట్టుకుని విద్యుదాఘాతానికి గురైంది.సాక్షి అహుజా అనే మహిళ విద్యుదాఘాతానికి గురై స్పృహతప్పి పడిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు విద్యుత్ స్తంభం నుంచి కొన్ని వైర్లు బయటకు వచ్చాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, విద్యుదాఘాతానికి గురైన మహిళకు సమీపంలోని వ్యక్తులు సహాయం చేయడానికి ప్రయత్నించారు. అనంతరం ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అధికారుల నిర్లక్ష్యంపై మహిళ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యుదాఘాతం ఎలా జరిగిందనే దాని గురించి పోలీసులు మాట్లాడుతూ, ఇన్సులేషన్ వైఫల్యం కారణంగా స్తంభంపై ఉన్న కేబుల్ నుంచి కరెంట్ లీకేజీ ఉందని చెప్పారు. ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందో తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతోంది.
తాజావార్తలు
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
-
Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
-
Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..