మధ్యప్రదేశ్లోని ఇండోర్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన లైవ్-ఇన్ పార్ట్నర్ మృతదేహాన్ని మూడు రోజుల పాటు తన ఇంటిలోనే ఉంచుకున్నాడు. ఆమె అంత్యక్రియలకు డబ్బు లేకపోవడంతో మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి రోడ్డుపై వదిలేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం చందన్ నగర్ ప్రాంతంలో గోనె సంచిలో 57 ఏళ్ల మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) నందిని శర్మ తెలిపారు.
టాప్ క్లాస్ బౌలింగ్తో ఫైనల్లో గెలిపించిన బౌలర్లు
మహిళ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని.. ఆమె చాలా కాలంగా కాలేయ సంబంధిత సమస్యలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని పోస్ట్మార్టంలో తేలిందని, దీంతో ఆమె సహజ మరణానికి దారితీసిందని ఏసీపీ తెలిపారు. అయితే.. మృతురాలు గత పదేళ్లుగా ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోందని పేర్కొన్నారు. రాజ్మొహల్లా ప్రాంతంలోని తోటలో ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతను మానసికంగా బలహీనంగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.
Kalki 2898 AD: షాకింగ్ : రిలీజ్ కు ముందే ఓటీటీలోకి భైరవ?
మరోవైపు.. అంతకుముందు ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేశారని ఏసీపీ చెప్పారు. ఆ వ్యక్తి మృతదేహాన్ని మూడు రోజులుగా ఇంట్లోనే ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారు ఫిర్యాదు చేయడంతో శనివారం రాత్రి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ఇంటి నుంచి 200 మీటర్ల దూరం తీసుకెళ్లాడు. అంత్యక్రియలకు డబ్బు లేని కారణంగా మృతదేహాన్ని రోడ్డుపై వదిలేచినట్లు ఆ వ్యక్తి తెలిపాడన్నారు. మరోవైపు మహిళ మృతిపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఏసీపీ నందిని శర్మ తెలిపారు. సోమవారం మహిళకు అంత్యక్రియలు నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు.