Vizag Constable Case: భార్యే హంతకురాలు.. కానిస్టేబుల్ రమేష్ హత్య కేసును ఛేదించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Constable Case: విశాఖలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రమేష్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. భార్యే హంతకురాలిగా పోలీసులు నిర్ధారించారు. ప్రియుడి మోజులో పడి భర్తను కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కానిస్టేబుల్ హత్య కేసును సీపీ స్వయంగా పర్యవేక్షించారు. రమేశ్ మృతి కేసుపై లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. రమేష్ భార్య శివాని మొబైల్లోని వీడియోస్, వాట్సాప్ చాటింగ్ పరిశీలించారు. ఇప్పటికే భార్య శివాని, ప్రియుడు రామారావు, స్నేహితుడు నీలాలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నగర కమిషనర్ సీపీ త్రివిక్రమ వర్మ మీడియాకు వివరించారు.
Also Read: Vizag Constable Case: ఆమె అందమే అతనికి శాపం.. ప్రియుడితో కలిసి కానిస్టేబుల్ని చంపిన భార్య
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ రమేష్ను భార్య శివాని హత్య చేయించిందని ఆయన తెలిపారు. మూడు రోజులు క్రితం రమేష్ అనుమానాస్పదంగా మృతి చెందాడని భార్య ఫిర్యాదు చేసిందని.. ఎటువంటి గాయాలు లేకపోవడంతో పోస్టుమార్టంకు పంపించినట్లు ఆయన తెలిపారు. అందులో ఊపిరి ఆడక చనిపోయినట్లు తేలిందని.. దీనితో కేసును లోతుగా విచారించామని సీపీ వెల్లడించారు. భార్యే ప్రియుడి కోసం భర్తను చంపించిందని ఆయన చెప్పారు. మూడు రోజుల క్రితం మద్యం తాగించి వీడియో తీసిందన్నారు. ఆ తరువాత రమేష్ పడుకున్న తరువాత ప్రియుడు రామారావు బయట ఉన్నాడని.. రామారావు స్నేహితుడు దిండితో నొక్కి చంపాడని సీపీ వివరించారు. ఆ సమయంలో రమేష్ కదలకుండా భార్య కాళ్ళు పట్టుకుందని.. రమేష్ను చంపేందుకు నీలా అనే వ్యక్తికి లక్ష రూపాయలు సుపారీ ఇచ్చినట్లు సీపీ పేర్కొన్నారు.
వీరి ప్రేమ వ్యవహరంపై గతంలో అనేక గొడవలు జరిగాయని.. పిల్లల్ని వదిలి ప్రియుడితో వెళ్ళిపోవాలని రమేష్ కోరాడని సీపీ చెప్పారు. పిల్లలు, ప్రియుడు ఇద్దరు కావాలని అడ్డుగా ఉన్న రమేష్ను చంపిందని ఆయన తెలిపారు. ప్రియుడు రామారావుకు బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర ఇచ్చిందని.. శివానికి నేర స్వభావం ఉందని సీపీ చెప్పారు. ఆమె తల్లిదండ్రులతో కూడా గొడవలు ఉన్నాయన్నారు. ఏ1గా భార్య శివాని, ఏ2గా ప్రియుడు రామారావు, ఏ3గా నీలాను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!