Rahul Gandhi: “మీరెందుకు సర్దుబాటు చేసుకోలేరు..?” 3 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఫలితాలను చవిచూసింది. అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు ప్రజా వ్యతిరేకత ఉన్న రాష్ట్రాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను బీజేపీకి అప్పగించింది. కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలు మూడింటితో ఓడిపోవడం ఆ పార్టీని దెబ్బతీసింది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఓటమిపై గురువారం సీడబ్ల్యూసీ మీటింగ్లో చర్చించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు స్థానిక ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవాల్సిన అవసరాన్ని రాహుల్ గాంధీ పార్టీ నేతలకు సూచించారు. 2024 ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీని, ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
Read Also: Varun Gandhi: “నిజమైన నాయకుడు అలా చేయడు”.. నానమ్మ ఇందిరాగాంధీపై బీజేపీ ఎంపీ ప్రశంసలు..
ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నాలుగుసార్లు బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ ప్రజావ్యతిరేకత ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ క్యాష్ చేసుకోలేకపోయింది. అయితే, బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ చిన్న పార్టీలతో సర్దుబాటు చేసుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్లు ఎందుకు సిద్ధంగా లేవని ప్రశ్నించారు. చిన్న పార్టీలకు పోలైన ఓట్లను బీజేపీ పొందడం వల్లే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముందు అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ(ఎస్పీ)తో సీట్ల సర్దుబాటుపై విభేదాలను గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించారు. కాంగ్రెస్ చిన్న పార్టీలతో సీట్ల సర్దుబాటును అంగీకరించి ఉండాల్సిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన మూడు రాష్ట్రాల్లో సరిగ్గా ప్రచారం చేయలేదని రాహుల్ గాంధీ భావించారు. పలువురు నేతలు మాత్రం ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగత బలాన్ని ఎత్తి చూపేందుకు ప్రయత్నించారు. అయితే 2018లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచిన విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తుచేశారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ఎన్టీఆర్ బర్త్డే కానుకగా ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!