Rahul Gandhi: సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఫలితాలను చవిచూసింది. అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు ప్రజా వ్యతిరేకత ఉన్న రాష్ట్రాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను బీజేపీకి అప్పగించింది. కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలు మూడింటితో ఓడిపోవడం ఆ పార్టీని దెబ్బతీసింది.