Akhilesh Yadav: సీఎం పర్యటనకు వెళ్తే మాఫియా స్వాగతం పలుకుతుంది.. అఖిలేష్ సంచలన కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: సమాజ్వాదీ పార్టీ అధినేత సంచలన కామెంట్స్ చేశారు. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అన్ని అక్రమ నిర్మాణాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన కార్యక్రమాలను మాఫియా ద్వారా స్వాగతిస్తున్నారని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆదివారం ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలను అప్రతిష్టపాలు చేసేందుకు అధికార బీజేపీ సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించిన అఖిలేష్ యాదవ్.. బిజెపికి వ్యతిరేకంగా బలంగా పోరాడుతున్న ప్రతిపక్ష నేతల ప్రతిష్టను ఈ కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుని చెడగొడుతున్నారని అన్నారు.
Read Also: Budget Session: రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. విపక్షాల టార్గెట్ ఆదే అంశం
Also Read
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
జరుగుతున్న దాడులన్నీ రాజకీయాలే.. బీజేపీ ఉద్దేశం సరిగా లేదని విమర్శించారు. దేశ ప్రజలకు అవగాహన, సున్నితత్వం ఉందని.. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని తెలిసి అందుకే దాడులు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. మహమూదాబాద్లో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు విలేకరులతో మాట్లాడారు. బీజేపీ రాజ్యాంగాన్ని, చట్టాన్ని అంగీకరించదని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లో నేడు జరుగుతున్న అక్రమ నిర్మాణాలన్నీ బీజేపీ నేతలవేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లినప్పుడు మాఫియా స్వాగతం పలుకుతుందని సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి తనపై ఉన్న కేసులను ఉపసంహరించుకున్నారని, ఉపముఖ్యమంత్రిపై ఉన్న కేసులను కూడా ఉపసంహరించుకున్నారని, అందుకే సమాజ్వాదీ పార్టీ డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం రాష్ట్రంలోని టాప్ 100 మాఫియా జాబితాను విడుదల చేయడం లేదని ఆరోపించారు.
తాజావార్తలు
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్కు మారిన ‘418’ రిలీజ్!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?