What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ మీడియా సమావేశం
- నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు
- నేడు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెమీస్ మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబు విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఒక వివాహ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర బడ్జెట్, సూపర్ సిక్స్ హామీల అమలు, అన్నదాతల కష్టాలు, అక్రమ అరెస్టులు సహా అనేక అంశాలపై మీడియాతో జగన్ మాట్లాడనున్నారు.
Also Read
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మండలిలో టీడీపీ, సభ్యుల మాటల యుద్ధం కొనసాగుతోంది.
నేడు విశాఖ నగరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రానున్నారు.
ఇవాళ విజయవాడ స్తెబర్ క్త్రెం పోలీసుల ఎదుట మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరుకానున్నారు. ఇప్పటికే సెక్షన్ 35 బార్ త్రిబిఎన్ఎస్ఎస్ కింద గోరంట్లకు పోలీసులు నోటీసు ఇచ్చారు.
వైసీపీ నేత వల్లభనేని వంశీ కేసులో నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. కేసులో ఏ4 వీర్రాజు, ఏ10 వంశీ బాబు ఇద్దరిని రెండు రోజులు కస్టడీకి న్యాయస్థానం ఇచ్చిన విషయం తెలిసిందే.
నేడు రాజమండ్రీలో సీపీఐ జిల్లా స్థాయి కార్యకర్తల వర్క్ షాప్ జరగనుంది. రాజమండ్రి సీపీఐ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది.
నేటి నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగుతాయి.
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు ఉదయం శ్రీకృష్ణ అలంకారంలో భక్తులకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనమివ్వనున్నారు. సాయంత్రం పొన్న వాహన సేవ ఉంటుంది.
నేడు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ జరగనుంది. లాహోర్ గడ్డాఫీ స్టేడియంలో మధ్యాహ్నం 2.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
Survival Thriller: గుహల్లో చిక్కుకున్న స్నేహితులు.. ప్రాణాలు తీసే రహస్య జీవి… వణికించబోతున్న సర్వైవల్ థ్రిల్లర్
-
Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
-
Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
-
Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!