What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
- సంగారెడ్డికి వెళ్లనున్న కేటీఆర్
- మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు నాల్గవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. కడపలో త్రాగునీటి సమస్య, ఫీజు రీయింబర్స్మెంట్, తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గిరిజన గ్రామాలలో కనీస సదుపాయాలు, విద్యాశాఖలో ఖాళీలు.. అంశాలపై చర్చలు జరగనున్నాయి.
నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు మధ్యాహ్న ఒంటి గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు.
Also Read
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
నేడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డికి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల బృందంతో కలిసి సంగారెడ్డి జైలులో అక్రమంగా నిర్బంధించిన కొడంగల్ నియోజకవర్గం లఘుచర్ల గ్రామ రైతులను ఆయనను పరామర్శించనున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కురుస్తోంది. వరుసగా రెండోరోజు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) తీవ్ర స్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం వరకు 428గా నమోదైంది. దీంతో కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) 3 అమలు చేస్తున్నట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ పేర్కొనింది.
ఝార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనున్నారు.
బిర్సా ముండా గౌరవార్థం స్మారక నాణెం మరియు తపాలా స్టాంపును నేడు పీఎం నరేంద్ర మోడీ ఆవిష్కరిస్తారు.
నేడు శ్రీశైలంలో పాతాళగంగలో కృష్ణమ్మకు నదీహారతి, జ్వాలాతోరణ మహోత్సవం జరగనుంది. అలానే ఆలయ పుష్కరిణిలో లక్ష దీపోత్సవం జరగనుంది.
కార్తీక పౌర్ణమి సందర్బంగా వేములవాడ రాజన్న ఆలయంకు భక్తులు పోటెత్తారు. ఆలయం ముందు భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సాయంత్రం ఆలయం ముందు భాగంలో జ్వాలా తోరణం ఉంటుంది.
నేడు భక్తి టీవీ ‘కోటి దీపోత్సవం’లో 7వ రోజు. సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో కార్తీక దీపారాధన జరగనుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష కార్యక్రమాలు జరగనున్నాయి.
టీ20 సిరీస్పై కన్నేసిన భారత్ ఆఖరిదైన నాలుగో టీ20లో నేడు దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. 2-1 ఆధిక్యంతో సిరీస్ కోల్పోయే అవకాశం లేని స్థితిలో ఉన్న సూర్య సేన.. రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు సొంతగడ్డపై సిరీస్ చేజారనివ్వకూడదని దక్షిణాఫ్రికా పట్టుదలగా ఉంది. జొహానెస్బర్గ్లో రాత్రి 8.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!