*హైదరాబాద్: నేడు విడుదల కానున్న బీఆర్ఎస్ తొలి జాబితా.. 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న కేసీఆర్
*నేడు విజయవాడలో ఏపీ ఎన్జీవో రాష్ట్ర మహాసభలు.. హాజరుకానున్న సీఎం జగన్, పలువురు మంత్రులు
*నేడు నిర్మల్కు కిషన్ రెడ్డి.. ఉ.10 గంటలకు నిర్మల్లో ఉండే విధంగా ప్లాన్..
*కర్నూలు: నేటి నుంచి గూడూరు మండలం పెంచికలపాడులో సీపీఎం ఆధ్వర్యంలో రిలే దీక్షలు.. ఆక్రమణకు గురైన మర్రిమాను చెరువును పరిరక్షించాలని డిమాండ్
*తిరుపతి: నేటి నుంచి 23 వరకు వాల్మీకిపురం శ్రీపట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు
*తిరుమల: ఇవాళ గరుడ పంచమి సందర్భంగా గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
*నేడు శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవార్లకు ఆలయంలో సహస్ర దీపాలంకరణ, వెండి రథోత్సవం
*నేడు ఆసియా కప్కు భారత జట్టు ప్రకటన