What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- నేడు ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు
- రెండోరోజు ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్
- నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎంపీలు ఈటల, రఘునందన్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు. సీఎం అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశం. మధ్యాహ్నం కొన్ని శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.
అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు జగన్ మీడియా సమావేశం. అక్రమ కేసులు, సూపర్ సిక్స్ హామీల వైఫల్యాలపై మాట్లాడనున్న జగన్. ఇవాళ సాయంత్రం 4.20కి బెంగళూరుకు జగన్.
Also Read
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- 6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
- ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
- Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
ఢిల్లీ: నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి CR పాటిల్తో రేవంత్ రెడ్డి భేటీ. రేవంత్తో పాటు భేటీలో పాల్గొననున్న మంత్రి ఉత్తమ్, ఉన్నతాధికారులు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై మరోసారి ఫిర్యాదుతో పాటు తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులపై కేంద్రమంత్రితో చర్చించనున్న సీఎం రేవంత్, ఉత్తమ్.
హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎంపీలు ఈటల, రఘునందన్రావు. తమపై నమోదైప క్రిమినల్ కేసులు కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించిన ఎంపీలు. ఈటలపై కమలాపూర్లో, రఘునందన్రావుపై దుబ్బాక పీఎస్లో గతంలో కేసులు. ఇవాళ విచారించనున్న హైకోర్టు.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,510 లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,920 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,21,100 లుగా ఉంది.
నేడు యాదాద్రి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన. కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న పొంగులేటి.
ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు. అర్మేనియా నుంచి భారత్ చేరుకున్న తొలి విమానం. ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న 110 మంది భారతీయులు. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయులను వెనక్కి తీసుకొస్తున్న కేంద్రం. ఇరాన్ నుంచి స్వదేశానికి రావడం సంతోషంగా ఉంది.
ఏపీ లిక్కర్ స్కాం నిందితుల బెయిల్ పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టు విచారణ. లిక్కర్ స్కాం కేసులో A1 రాజ్ కేసీరెడ్డి, A8 చాణక్య, A30 దిలీప్ల బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేయనున్న ఏసీబీ కోర్టు.
రెండోరోజు ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్.. నేడు కేంద్రమంత్రి మాండవియాతో భేటీ కానున్న లోకేష్.. యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో సమావేశం కానున్న లోకేష్
తాజావార్తలు
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?