What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు కీలక కేసుల్లో తీర్పులు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు, సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద నేడు తీర్పు ఇవ్వనున్న హైకోర్టు.
శాంతిస్తున్న కృష్ణమ్మ. క్రమంగా తగ్గుతున్న కృష్ణా నది వరద ఉదృతి. 12 లక్షల క్యూసెక్కుల వరద నీటికి చేరకుండా ప్రకాశం బ్యారేజ్ దగ్గర తగ్గుతున్న నీటి మట్టం. నిన్న రాత్రి 9 గంటలకు 11.13 లక్షల వరద ప్రవాహం. ఇవాళ ఉదయం 5 గంటల నాటికి 9.79 లక్షల క్యూసెక్కుల కు చేరి తగ్గిన వరద ప్రవాహం. మధ్యాహ్నం సమయానికి బ్యారేజ్ దగ్గర మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్న అధికారులు.
Also Read
- iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
- Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
- Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
నేటితో శ్రీశైలం మహాక్షేత్రంలో ముగియనున్న శ్రావణ మసోత్సవాలు. శ్రావణ మాసం మొదటి రోజు ప్రారంభించిన శివ సప్తాహ భజనలు రేపటితో ముగింపు. శ్రావణమాసం ముగుస్తుండటంతో శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి పెరగనున్న భక్తుల రద్దీ.
నేడు ఖమ్మం నుంచి మహబూబాబాద్, వరంగల్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా లో నేడు మంత్రి శ్రీధర్ బాబు పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న మంత్రి శ్రీధర్ బాబు.
మూడో రోజు జలదిగ్బంధంలో ఏడు పాయల వనదుర్గ మాత. మంజీరా బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేయడంతో ఏ క్షణాన అయిన భారీ వరద వచ్చే అవకాశం. ఇప్పటికే అమ్మవారి ఆలయం చుట్టూ ఉగ్రరూపం దాల్చిన మంజీరా నది. అమ్మవారి పాదాలను తాకుతూ ఏడు పాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతున్న మంజీరా. గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు అందుకుంటున్న అమ్మవారు.
నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో 20 రైళ్లు రద్దు. వర్షాలతో ఇప్పటివరకు 544 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. నేడు మరో 20 రైళ్లు దారి మళ్లింపు, ఇప్పటివరకు 187 రైళ్లు దారి మళ్లింపు. తాత్కాలికంగా 3 రోజుల్లో 20కి పైగా రైళ్లు రద్దు.
మహబూబాబాద్ జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు. భారీ వర్షాలతో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటన.
నేడు వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ. విజయవాడ కలెక్టరేట్లోనే రాత్రి సీఎం చంద్రబాబు బస.
ఇంకా వరద ముంపులోనే ఖమ్మంలోని పలు కాలనీలు. ఖమ్మంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. తెలంగాణలో వరదకు ఇప్పటివరకు 16 మంది మృతి.
విశాఖ: బలహీనపడిన వాయుగుండం. అల్పపీడనంగా మారి వాయుగుండం. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం. కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. ఈనెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.
తెలంగాణలో 11 జిల్లాలకు భారీ వర్ష సూచన. 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశం. రానున్న మూడు గంటల్లో పలుచోట్ల మోస్తరు వానలు. హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, భువనగిరి జిల్లాలకు వర్షసూచన.
తాజావార్తలు
-
NTR Dragon: యూరప్లో కాదు.. ఆర్ఎఫ్సిలో యాక్షన్ రచ్చ! ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం భారీ సెట్
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి నేడు పండగే!
-
Mojtaba Khamenei: హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు.. “జిహాద్, ప్రతిఘటనే ఏకైక మార్గం”.. మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు
-
The Paradise: 20 కోట్ల వ్యూస్తో దుమ్మురేపిన ‘ఆయా షేర్’.. ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్పై బిగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!