Bank Account: చనిపోయిన వ్యక్తి అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేయడం ఎలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరణించిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి నగదు ఎలా తీసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. చనిపోయిన వ్యక్తి బంధువులైనా.. తోడ బుట్టిన వాళ్లయినా.. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా నగదును విత్ డ్రా చేస్తే చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరణించిన వారి అకౌంట్ నుంచి డబ్బులు తీసేందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని తప్పకుండా పాటించాల్సిందే. వారికి సంబంధించిన ఏటీఎం మీ దగ్గర ఉన్నా.. దానిని వాడ కూడాదు. ఒక వేళ వాడితే చిక్కుల్లోపడతారన్న విషయం తెలుసుకోవాలి. ఓ వ్యక్తి వృద్ధాప్యం వల్లనో లేక అనుకోని పరిస్థితుల్లో చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏటీఎం ద్వారా నగదు తీసుకుంటారు. కాని అకౌంట్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన డబ్బు ఎలా తీసుకోవాలో తెలియక తికమక పడుతుంటారు.
READ MORE:Navodaya Jobs: నవోదయ విద్యాలయాల్లో భారీగా ఖాళీల భర్తీ.. పూర్తి వివరాలు ఇలా..
Also Read
- Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
- PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
- US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. "నిఘా"పై పెంటగాన్ హెచ్చరిక..
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
అప్పుడు ఏం చేయాలంటే ఆ వ్యక్తి అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంకు అధికారులను కలవాల్సి ఉంటుంది. సంబంధిత పత్రాలు తీసుకుని రమ్మని అధికారులు చెబుతారు. ఆ కుటుంబం అతని మరణ ధ్రువీకరణ పత్రంతో సహా సంబంధిత పత్రాలను బ్యాంకులో ఇచ్చి.. ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును పొందడానికి ప్రయత్నిస్తారు. ఫలానా వ్యక్తి మరణించిన తరువాత అతని నుండి డబ్బు విత్డ్రా అయ్యిందని తెలిస్తే అది పెద్ద సమస్య కూడా కొన్ని సందర్భాల్లో అవుతుంది. ఇది అనవసరమైన సమస్యలను నివారించడానికి ప్రవేశపెట్టిన పద్ధతి. అకౌంట్ తెరిచినప్పుడు ఒకరు లేదా ఇద్దరిని నామినీలుగా చేర్చుకోవడం జరుగుతుంది. వ్యక్తి మరణానంతరం మరణ ధ్రువీకరణ పత్రంతో పాటుగానామినీలు వారికి ఇచ్చిన కొన్ని సూచనలను పాటించాలి. నామినీలు వారి స్వంత కేవైసీ (KYC) విధానాలను పూర్తి చేయాలి. నామినీ ఐడీ, అడ్రస్ ప్రూఫ్ అన్ని సమర్పించాలి. నామినీ కేవలం డబ్బుకు సంరక్షకుడు మాత్రమే, డబ్బును మరణించిన వారి వారసులకు సమానంగా పంపిణీ చేయాలి. గందరగోళం ఏర్పడితే దానిని చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి. అదేవిధంగా ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతా తెరిచేటప్పుడు నామినీని పెట్టకపోయినా.. వారి మరణం తర్వాత చట్టబద్ధమైన వారసుల ధ్రువీకరణ పత్రాన్ని, మరణ ధృవీకరణ పత్రానికి జతచేయాలి. వారసులందరూ ఒప్పుకొన్న తర్వాతే మరణించిన వారి బ్యాంకు ఖాతాలోని డబ్బును ఉపయోగించవచ్చు.
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!