Bank Account: చనిపోయిన వ్యక్తి అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేయడం ఎలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరణించిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి నగదు ఎలా తీసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. చనిపోయిన వ్యక్తి బంధువులైనా.. తోడ బుట్టిన వాళ్లయినా.. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా నగదును విత్ డ్రా చేస్తే చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరణించిన వారి అకౌంట్ నుంచి డబ్బులు తీసేందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని తప్పకుండా పాటించాల్సిందే. వారికి సంబంధించిన ఏటీఎం మీ దగ్గర ఉన్నా.. దానిని వాడ కూడాదు. ఒక వేళ వాడితే చిక్కుల్లోపడతారన్న విషయం తెలుసుకోవాలి. ఓ వ్యక్తి వృద్ధాప్యం వల్లనో లేక అనుకోని పరిస్థితుల్లో చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏటీఎం ద్వారా నగదు తీసుకుంటారు. కాని అకౌంట్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన డబ్బు ఎలా తీసుకోవాలో తెలియక తికమక పడుతుంటారు.
READ MORE:Navodaya Jobs: నవోదయ విద్యాలయాల్లో భారీగా ఖాళీల భర్తీ.. పూర్తి వివరాలు ఇలా..
Also Read
- Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
- NEET Paper Leak: రూ. 30 వేలకే నీట్ పేపర్?.. లీక్లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల ప్రమేయం..
- Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
అప్పుడు ఏం చేయాలంటే ఆ వ్యక్తి అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంకు అధికారులను కలవాల్సి ఉంటుంది. సంబంధిత పత్రాలు తీసుకుని రమ్మని అధికారులు చెబుతారు. ఆ కుటుంబం అతని మరణ ధ్రువీకరణ పత్రంతో సహా సంబంధిత పత్రాలను బ్యాంకులో ఇచ్చి.. ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును పొందడానికి ప్రయత్నిస్తారు. ఫలానా వ్యక్తి మరణించిన తరువాత అతని నుండి డబ్బు విత్డ్రా అయ్యిందని తెలిస్తే అది పెద్ద సమస్య కూడా కొన్ని సందర్భాల్లో అవుతుంది. ఇది అనవసరమైన సమస్యలను నివారించడానికి ప్రవేశపెట్టిన పద్ధతి. అకౌంట్ తెరిచినప్పుడు ఒకరు లేదా ఇద్దరిని నామినీలుగా చేర్చుకోవడం జరుగుతుంది. వ్యక్తి మరణానంతరం మరణ ధ్రువీకరణ పత్రంతో పాటుగానామినీలు వారికి ఇచ్చిన కొన్ని సూచనలను పాటించాలి. నామినీలు వారి స్వంత కేవైసీ (KYC) విధానాలను పూర్తి చేయాలి. నామినీ ఐడీ, అడ్రస్ ప్రూఫ్ అన్ని సమర్పించాలి. నామినీ కేవలం డబ్బుకు సంరక్షకుడు మాత్రమే, డబ్బును మరణించిన వారి వారసులకు సమానంగా పంపిణీ చేయాలి. గందరగోళం ఏర్పడితే దానిని చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి. అదేవిధంగా ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతా తెరిచేటప్పుడు నామినీని పెట్టకపోయినా.. వారి మరణం తర్వాత చట్టబద్ధమైన వారసుల ధ్రువీకరణ పత్రాన్ని, మరణ ధృవీకరణ పత్రానికి జతచేయాలి. వారసులందరూ ఒప్పుకొన్న తర్వాతే మరణించిన వారి బ్యాంకు ఖాతాలోని డబ్బును ఉపయోగించవచ్చు.
తాజావార్తలు
-
Money as Prasad: లక్ష్మీదేవి కటాక్షం అంటే ఇదేనేమో! ఈ దేవాలయాల్లో ప్రసాదంగా డబ్బులు, బంగారం.. ఎక్కడో తెలుసా?
-
Weather News: ఆస్ట్రేలియా నుంచి గుడ్న్యూస్..ఇండియాలో వర్షాలు..!
-
Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
-
Peddi: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ‘పెద్ది’ ట్రైలర్ తర్వాత ఫ్యాన్స్కు ఇచ్చే గిఫ్ట్ ఇదే!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!