ఏదైనా వస్తువులతో వెళ్తున్న లారీ.. రోడ్డుపై బోల్తా పడిందంటే ఏం చేస్తారు. దగ్గరలోని స్థానికులు వచ్చి అందులోని వస్తువులను లూఠీ చేస్తారు. మనం ఇంతకుముందు చాలా ఘటనలు చూసి ఉంటాం. టమాటా, బీర్లు, బిస్కెట్స్, ఎగ్స్, కూరగాయాలు ఇలా ఏ వస్తువులైనా.. వాటిని తీసుకెళ్తున్న ట్రక్కులు, లారీలు బోల్తా పడ్డాయంటే స్థానికులు క్షణాల్లో లూఠీ చేసేస్తారు. కానీ తాజాగా జమ్మూ కశ్మీర్ లో ఏం జరిగిందంటే.. శ్రీనగర్ హైవేపై ఓ యాపిల్స్ లారీ వెళ్తుండగా.. రాంబన్లోని నాచల్నా ప్రాంతంలో బోల్తా పడింది. దీంతో ఈ సంఘటనను చూసిన రోడ్డుపై వెళ్తున్న ట్రక్కు, లారీ డ్రైవర్లు, ప్రయాణికులు, ట్రాఫిక్ పోలీసులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. యాపిల్ బాక్సులన్నీ సురక్షితంగా బయటకు తీసి.. మంచి మనసును చాటుకున్నారు.
Read Also: Terrorist Arrest: ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అరెస్ట్.. ఐసిస్ మాడ్యూల్తో సంబంధాలు
ఆ తర్వాత.. ట్రాఫిక్ పోలీసులు ఆ రహదారిని మొత్తం క్లియర్ చేశారు. రోడ్డు ప్రమాదానికి గురైన ట్రక్కులో రూ. 25 నుంచి 30 లక్షల యాపిల్స్ ఉన్నాయి. ఇవన్నీ లూఠీ కాకుండా సురక్షితంగా ఓ పక్కన పెట్టేశారు. దీంతో ఆపిల్ వ్యాపారికి లక్షల ఆస్తి నష్టం తప్పింది. ఈ సహాయంపై వ్యాపారి వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు. ఇదిలా ఉంటే.. రాంబన్ జిల్లా కమీషనర్ మస్రత్ జియా స్వయంగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారందరిని ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే.. జమ్మూ కాశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు కూడా తన హ్యాండిల్లో ఈ సంఘటన యొక్క వీడియోను విడుదల చేసారు. దేశంలో జరిగే ఇలాంటి సంఘటనల్లో సహాయ పడాలని.. వస్తువులను లూఠీ చేయొద్దని పోలీసులు చెబుతున్నారు.
Event of the Day: Passengers, drivers join Traffic & Ex Police, Army & Paramilitary forces in securing fruit boxes from turtled truck at Nachlana on NH-44. Thank you. @diprjk @OfficeOfLGJandK @DrJitendraSingh @Rameshkumarias @mussarat_zia pic.twitter.com/91yudD9GUq
— Mussarat Zia (@mussarat_zia) October 2, 2023
Read Also: World Costly Nail Polish : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ ఇదే..ప్రత్యేకత ఏంటంటే?