Rahul Gandhi: ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈరోజు వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రజల ఫలితాలని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇది ప్రజల విజయం. ఈ పోరాటం మోడీ వర్సెస్ పబ్లిక్ అని ఖర్గే పేర్కొన్నారు.
CPI Narayana: రాష్ట్ర, కేంద్ర ఎన్నికల ఫలితాలపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..
Also Read
- India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
- Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ పిల్లల్ని అణచివేస్తోంది.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
- US-Iran: శాంతి ఒప్పందంపై ప్రతిష్టంభన.. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
- Modi-Trump: మోడీ మంచి మిత్రుడు.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు.. ట్రంప్ ప్రశంసల వర్షం
ఈ పోరాటం రాజ్యాంగాన్ని కాపాడేందుకే: రాహుల్ గాంధీ
మరోవైపు.. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత ప్రజలకు, ఇండియా కూటమి నేతలకు.. పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అన్నారు. కూటమి కేవలం ఒక రాజకీయ పార్టీ కోసం పోరాడలేదని.. ప్రభుత్వ సంస్థలపై ఈ ఎన్నికల్లో పోటీ చేసిందని తెలిపారు. ఈ ఎన్నికలు ఈడీ, సీబీఐకి వ్యతిరేకంగా జరిగాయని.. రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ ఎన్నికలు జరిగాయన్నారు. దేశంలోని పేదలు, రైతులు, వెనుకబడిన వాళ్ళే రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ముందుకు వచ్చారని తెలిపారు. కాంగ్రెస్ మీతో ఉంటుంది.. మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఏర్పాటుపై రాహుల్ గాంధీ ఏం చెప్పారు?
ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దానిపై మీరు ఏమనుకుంటున్నారు? అని అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘మా కూటమి నేతలతో మాట్లాడి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు. మరోవైపు.. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఆధిక్యంపై స్పందించారు. తమ వెనుక దాక్కున్న తన సోదరి కృషికి ఈ విజయమని తెలిపారు.
Amit Shah: 7 లక్షల ఓట్ల తేడాతో అమిత్ షా అఖండ విజయం..
ఇది ప్రజాస్వామ్య విజయం: ఖర్గే
18వ లోక్సభ ఎన్నికల ఫలితాలను వినమ్రంగా అంగీకరిస్తున్నామని ఖర్గే తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఈ ఆదేశం ప్రధాని మోడీకి వ్యతిరేకమని తేలిపోయిందని అన్నారు. ఇది మోడీ నైతిక పరాజయం అని.. ఇది ప్రజాస్వామ్య విజయం అని తెలిపారు. మరోవైపు.. బీజేపీ ప్రభుత్వ యంత్రాంగం తమను అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని.. తమ బ్యాంక్ ఖాతాలు కూడా సీజ్ చేశారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేశారని.. ప్రత్యర్థి పార్టీలపై కక్ష్య పూరితంగా వ్యవహరించారని తెలిపారు. మరోవైపు.. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలు తమకు చాలా కలిసి వచ్చాయని ఖర్గే పేర్కొన్నారు.
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!