MP Nandigam Suresh: చంద్రబాబు మాదిగలకు ఏం చేశాడు..? ఎస్సీలు జగన్ తోనే ఉన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Nandigam Suresh: ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేసి టీడీపీ ఆధ్వర్యంలో ఎస్సీ సభను నిర్వహించారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. గతంలో చంద్రబాబు మాదిగలకు ఏం చేశాడని ప్రశ్నించారు. గతంలో మాదిగలు సభలు పెట్టుకుంటే చంద్రబాబు అడ్డుకుని కేసులు పెట్టారని ఆరోపించారు. అదే విధంగా చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో మాదిగ కార్పొరేషన్ ఇస్తానని చెప్పి.. గెలిచిన తర్వాత ఆ ఊసే లేదన్నారు.
Read Also: Ukraine War: యుద్ధంలో రష్యా తరుపున పోరాడేందుకు క్రిమినల్స్..
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
అంతేకాకుండా 2014లో మాదిగ కులానికి సంబంధించి ఒక ఎంపీ సీటు ఇవ్వలేదని.. అదే వైసీపీ ప్రభుత్వంలో 2019లో 8 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చామని ఎంపీ సురేష్ తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీలు వైసీపీతోనే ఉన్నారన్నారు. మాదిగ సభలో టీడీపీ నేతలు అబద్ధాలు మాట్లాడారని.. అలా మట్లాడటానికి సిగ్గుండాలని విమర్శించారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో 29 లక్షల కుటుంబాలకు మేలు జరిగితే.. కేవలం ఆంధ్రప్రదేశ్ లో 29 లక్షల రూపాయల మేలు జరిగిందన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వమైతే సబ్ ప్లాన్ లు అమలు చేసిన దానిలో ఏపీ నెంబర్ వన్ లో ఉందని తెలిపిందన్నారు.
Read Also: Largest Kidney Stone: కిడ్నీలో రాయి కాదు పెద్ద బండ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్
టీడీపీలోని కొందరు నేతలు చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్నారని.. ఇంకెన్నాళ్లు చంద్రబాబును నమ్ముతారు అని విమర్శించారు. మరోవైపు ఎస్సీలను రాజధానిలో దొంగల కింద చిత్రించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు. కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఎస్సీలంటే గొప్పవారని చెప్పారని తెలిపారు. అటు వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి అవమానించి పంపిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబుకు ఎస్సీలంటే నచ్చదని.. అంతేకాకుండా అన్నీ కులాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేసిన మోసాలకు రాష్ట్ర ప్రజలు అందరూ జగన్ తోనే ఉన్నారని ఎంపీ సురేష్ తెలిపారు. అయితే ఎన్నికలు రాగానే కులాల కుంపట్లను చంద్రబాబు రాజేస్తున్నాడని దుయ్యబట్టారు. వచ్చే 15, 20 ఏళ్ళు ఈ రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని.. జగన్ పై టీడీపీ నేతలు పద్ధతి దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?