MP Nandigam Suresh: చంద్రబాబు మాదిగలకు ఏం చేశాడు..? ఎస్సీలు జగన్ తోనే ఉన్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Nandigam Suresh: ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేసి టీడీపీ ఆధ్వర్యంలో ఎస్సీ సభను నిర్వహించారని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. గతంలో చంద్రబాబు మాదిగలకు ఏం చేశాడని ప్రశ్నించారు. గతంలో మాదిగలు సభలు పెట్టుకుంటే చంద్రబాబు అడ్డుకుని కేసులు పెట్టారని ఆరోపించారు. అదే విధంగా చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో మాదిగ కార్పొరేషన్ ఇస్తానని చెప్పి.. గెలిచిన తర్వాత ఆ ఊసే లేదన్నారు.
Read Also: Ukraine War: యుద్ధంలో రష్యా తరుపున పోరాడేందుకు క్రిమినల్స్..
Also Read
- RCB Brand Value: ఐపీఎల్లో ఆర్సీబీ ఆల్ టైమ్ రికార్డ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ఫ్రాంచైజీగా..
- JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్లైన్ పెట్టి మరి..!
- Abhijeet Dipke: ప్రధాని పదవి వదిలి ఇన్ఫ్లూయెన్సర్ అవ్వండి: మోదీపై అభిజిత్ దీప్కే సెటైర్లు
- Assam Floods: అస్సాంలో ముంచెత్తిన వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య, 3 లక్షల మందిపై ప్రభావం
అంతేకాకుండా 2014లో మాదిగ కులానికి సంబంధించి ఒక ఎంపీ సీటు ఇవ్వలేదని.. అదే వైసీపీ ప్రభుత్వంలో 2019లో 8 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చామని ఎంపీ సురేష్ తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీలు వైసీపీతోనే ఉన్నారన్నారు. మాదిగ సభలో టీడీపీ నేతలు అబద్ధాలు మాట్లాడారని.. అలా మట్లాడటానికి సిగ్గుండాలని విమర్శించారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో 29 లక్షల కుటుంబాలకు మేలు జరిగితే.. కేవలం ఆంధ్రప్రదేశ్ లో 29 లక్షల రూపాయల మేలు జరిగిందన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వమైతే సబ్ ప్లాన్ లు అమలు చేసిన దానిలో ఏపీ నెంబర్ వన్ లో ఉందని తెలిపిందన్నారు.
Read Also: Largest Kidney Stone: కిడ్నీలో రాయి కాదు పెద్ద బండ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్
టీడీపీలోని కొందరు నేతలు చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్నారని.. ఇంకెన్నాళ్లు చంద్రబాబును నమ్ముతారు అని విమర్శించారు. మరోవైపు ఎస్సీలను రాజధానిలో దొంగల కింద చిత్రించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు. కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఎస్సీలంటే గొప్పవారని చెప్పారని తెలిపారు. అటు వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి అవమానించి పంపిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబుకు ఎస్సీలంటే నచ్చదని.. అంతేకాకుండా అన్నీ కులాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేసిన మోసాలకు రాష్ట్ర ప్రజలు అందరూ జగన్ తోనే ఉన్నారని ఎంపీ సురేష్ తెలిపారు. అయితే ఎన్నికలు రాగానే కులాల కుంపట్లను చంద్రబాబు రాజేస్తున్నాడని దుయ్యబట్టారు. వచ్చే 15, 20 ఏళ్ళు ఈ రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని.. జగన్ పై టీడీపీ నేతలు పద్ధతి దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
-
Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్కు మరో భారీ అవకాశం!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
RCB Brand Value: ఐపీఎల్లో ఆర్సీబీ ఆల్ టైమ్ రికార్డ్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ ఫ్రాంచైజీగా..
-
JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్లైన్ పెట్టి మరి..!
-
Maharani Season 5: ఐదేళ్లుగా ఓటీటీని ఏలుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. ఇప్పుడు ఐదో సీజన్కు కౌంట్డౌన్!
ట్రెండింగ్
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!