India-West Indies: విండీస్ టూర్ కు టీమిండియా సీనియర్లపై వేటు.. కొత్త కుర్రాళ్లకు ఛాన్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు చిత్తుగా ఓడింది. దీంతో టీమిండియాలోని పలువురు ఆటగాళ్లపై ఈ ఓటమి ప్రభావం గట్టిగానే పడేట్టుంది. టెస్టులలో కీలక ఆటగాళ్లైన నయా వాల్ ఛటేశ్వర్ పుజారాతో పాటు ఉమేశ్ యాదవ్ లపై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరుగబోయే విండీస్ సిరీస్లో వీళ్లిద్దరినీ టీమ్ యాజమాన్యం తప్పించనున్నట్టు సమాచారం.
Also Read : Centrol Govt: భారత్ లో ట్విట్టర్ మూసివేతపై కేంద్రం క్లారిటీ..
Also Read
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ లో పుజారాపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 50 పరుగులు కూడా చేయలేదు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పుజారాను తప్పించి కొత్త కుర్రాళ్లకు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్లు వినిపించాయి. పుజారాతో పాటు ఉమేశ్ యాదవ్ కెరీర్ కు కూడా ఎండ్ కార్డ్ పడ్డట్టే కనబడుతుంది. ఫామ్ కోల్పోయి భారత జట్టుకు చాలాకాలంగా దూరంగా ఉన్న ఉమేశ్.. డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఏమాత్రం తన బౌలింగ్ ప్రభావం చూపించలేక పోయాడు. ఈ మ్యాచ్ కు అశ్విన్ ను తప్పించి ఉమేశ్ ను ఎంపిక చేసినా అతడు బౌన్సీ వికెట్ పై అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు.
Also Read : Migration to BJP: బీజేపీలోకి మళ్లీ మొదలైన వలసలు.. కాషాయ గూటికి మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి..?
ఉమేష్, పూజారనే గాక వికెట్ కీపర్ కేఎస్ భరత్ పై కూడా వేటు పడే ఛాన్స్ ఉంది. రిషభ్ పంత్ గాయపడటంతో అతడి స్థానంలో టీమ్ లోకి వచ్చిన భరత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ ఆంధ్రా కుర్రాడు.. ఆడిన నాలుగు టెస్టులలో కేవలం 129 పరుగులే చేశాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ లో కేఎస్ భరత్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో విండీస్ టూర్ లో ఇతడిని కూడా పక్కనబెట్టి ఇషాన్ కిషన్ ను టెస్టులలో ఆడించే అవకాశాలున్నట్టు బోర్డు వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
Also Read : Nandamuri Balakrishna: మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి మృతికి బాలయ్య సంతాపం
పుజారా, ఉమేశ్, భరత్ పై వేటు వేసి ఐపీఎల్ తో పాటు దేశవాళీలో మెరుస్తున్న యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్ లతో పాటు పంజాబ్ కింగ్స్ తరఫున మెరుపులు మెరిపించిన యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మకు కూడా ఛాన్స్ దక్కొచ్చని తెలుస్తున్నది. త్వరలో విండీస్ టూర్ కు భారత జట్టును ప్రకటించే ఛాన్స్ ఉండటంతో దీనిపై క్లారిటీ రానుంది.
తాజావార్తలు
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
-
JP Nadda – CJP Leaders: నడ్డాతో సీజేపీ నాయకుల భేటీ.. సీజేపీ డిమాండ్స్ ఇవే!
-
Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
-
Monalisa: ‘నా జీవితం ప్రమాదంలో ఉంది’.. కుంభమేళా ఫేమ్ మోనాలిసా!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!