Migration to BJP: బీజేపీలోకి మళ్లీ మొదలైన వలసలు.. కాషాయ గూటికి మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Migration to BJP: తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారుతున్నాయి. అన్ని పార్టీల అసంతృప్త నేతలు పొరుగు పార్టీల వైపు చూస్తున్నారు. అలాగే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. పార్టీలు కూడా కీలక నేతలను చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నాయి. దీంతో బలమైన పార్టీల్లోకి వలసలు మొదలవుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల చేరికలు ముమ్మరం కానున్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి ఇటీవల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాష్ట్రంలో బీజేపీ వర్గాలు స్తబ్దుగా ఉండగా.. మళ్లీ పుంజుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్లో చేరేందుకు కీలక నేతలు చర్చలు జరుపుతుండగా.. బీజేపీలో చేరడం ఆగిపోయింది. ఈ తరుణంలో రంగారెడ్డితో డీకే అరుణ జరిపిన చర్చలు ఫలించాయని, త్వరలో రంగారెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం.
Read also: Monsoon for Telangana: ఈ నెల తెలంగాణకు నైరుతి రుతుపవనాలు.. ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం
Also Read
రంగారెడ్డితో పాటు మరికొందరు నేతలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయి. రంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కొద్ది నెలల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాషాయ తీర్థాన్ని సందర్శించారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ఆయన.. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సన్నిహితుడైన రంగారెడ్డి కూడా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి రంగారెడ్డి ఎమ్మెల్సీగా పనిచేశారు. అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతుండగా రంగారెడ్డి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ జోరు తగ్గిందని, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయం. నాలుగైదు రోజుల్లో ఇద్దరూ తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారు.
Nuclear Weapons: అణ్వాయుధ సామర్థ్యాలను పెంచుకుంటున్న భారత్
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!