panchayat election results: నేడు పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
panchayat election results: పశ్చిమ బెంగాల్లో పంచాయతీ, గ్రామీణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. గత నెల ప్రారంభంలో పంచాయతీ ఎన్నికల తేదీని ప్రకటించినప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ఘర్షణల్లో 40 మందికి పైగా మరణించడంతో ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. మూడంచెల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 61,000కు పైగా బూత్లలో జూలై 8న పోలింగ్ నిర్వహించగా, 80.71 శాతం ఓటింగ్ నమోదైంది. పలు చోట్ల బ్యాలెట్ బాక్సులను కొల్లగొట్టి, నిప్పుపెట్టి, చెరువుల్లో పడేసి హింసకు దారితీసింది. ఓటింగ్ రోజు హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో జులై 10వ తేదీన దాదాపు 696 బూత్లలో రీపోలింగ్ చేయాల్సి వచ్చింది. రీపోలింగ్ జరిగిన ప్రాంతాల్లో కూడా ఇవాళ ఫలితాలు వెలువడనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలకు అగ్ని పరీక్షగా భావించే పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి కానుండగా.. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కేంద్ర బలగాలను మోహరించి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు.
Also Read: Uttar Pradesh: ఆటోను ఢీకొట్టి బోల్తా పడిన గ్యాస్ ట్యాంకర్..9 మంది మృతి..
Also Read
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
జూలై 8 ఓటింగ్ సందర్భంగా నమోదైన ఘోరమైన హింసాకాండ, బూత్ క్యాప్చర్ సంఘటనల నేపథ్యంలో బెంగాల్లోని 19 జిల్లాల్లోని 696 బూత్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన రీ-పోలింగ్ జరగగా.. 69.85 శాతం మంది అర్హులైన ఓటర్లు సోమవారం తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సోమవారం మరో నలుగురు వ్యక్తులు మరణించినట్లు నివేదించబడింది. ఓట్ ట్యాంపరింగ్ ఆరోపణలు పంచాయితీ ఎన్నికలను దెబ్బతీశాయి. బెంగాల్లోని మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోని ప్రభావిత బూత్లలో రీపోలింగ్కు ఆదేశించాలని రాజీవ్ సిన్హా నేతృత్వంలోని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సోమవారం, రాష్ట్ర పోలీసులతో పాటు ప్రతి బూత్లో కనీసం నలుగురు కేంద్ర బలగాల సిబ్బందిని మోహరించి గట్టి భద్రత మధ్య ఉదయం 7 గంటలకు రీపోలింగ్ నిర్వహించారు. ఓటింగ్ బూత్లలో సాయంత్రం 5 గంటలకు క్యూలైన్లలో ఉన్న వారికి ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా ఓవర్ టైం పని చేస్తున్న ఎన్నికల అధికారులతో ఓటు వేసేందుకు అనుమతించారు.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..