Lok Sabha Election 2024 : పశ్చిమ బెంగాల్లో బిజెపి, టిఎంసి పరస్పర దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election 2024 : పశ్చిమ బెంగాల్లో నేడు (ఏప్రిల్ 19) ఓటింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్, అలీపుర్దువార్, జల్పైగురితో సహా మూడు ప్రధాన నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ సమయంలో కూచ్ బెహార్ నుండి హింస వార్తలు వెలుగులోకి వచ్చాయి. కూచ్ బెహార్లోని గిరియాకుతిలో పరిస్థితి మరింత దిగజారింది.. హింస కనిపించింది. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు బిజెపి, టిఎంసి పరస్పరం హింసకు సంబంధించి ఎన్నికల కమిషనర్కు పలు ఫిర్యాదులు చేశాయి. బిజెపి మద్దతుదారుల ఇళ్లను ధ్వంసం చేశారు. దీని కారణంగా బిజెపి మద్దతుదారులు తృణమూల్ కాంగ్రెస్ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అయితే దాడి ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది.
Read Also:G. Kishan Reddy: నన్ను గెలిపించండి.. సికింద్రాబాద్ ఎంపీగా మీ నమ్మకాన్ని నిలబెడుతాను..
Also Read
ఈ ఉదయం పోలింగ్ బూత్లు 226, 227కి చేరుకోవడానికి ముందు తృణమూల్ కార్యకర్తలపై తమ బూత్ ప్రెసిడెంట్ నేతృత్వంలోని బిజెపి గూండాలు హింసకు పాల్పడ్డారని టిఎంసి నాయకులు ఆరోపించారు. ప్రజల మద్దతు లేకపోవడంతో కలత చెందిన బిజెపి ఇప్పుడు హింసను ఆశ్రయించి మన ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుందని టిఎంసి ఆరోపించింది. మా గ్రామ పంచాయతీ సభ్యులను, బేగర్కట, బ్లాక్ నెం:-226లోని ప్రజలను గూండాలు వేధించి బెదిరించారని టీఎంసీ చెబుతోంది. మహిళా గ్రామ పంచాయతీ సభ్యురాలు ఓటు వేయకుండా బీజేపీ గూండాలు వేధించారని టీఎంసీ అంటోంది. ఇది వారి ప్రజాస్వామిక హక్కులను పూర్తిగా ఉల్లంఘించడమేనని ఎన్నికల కమీషనర్ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also:Lok Sabha Elections: చరిత్రలో తొలిసారి.. అతి తక్కువ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ..
పశ్చిమ బెంగాల్లోని మేదినీపూర్లో జరిగిన రాళ్లదాడి ఘటనపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద్ బోస్ స్పందించారు. శాంతి, సామరస్యాలను బెంగాల్ ప్రజలు కోరుకుంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. హింసకు పాల్పడే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం ఇది ఎన్నికల సంఘం బాధ్యత అన్నారు. దేశంలో ఈరోజు తొలి దశ ఎన్నికలు జరుగుతుండగా, 21 రాష్ట్రాల్లోని 102 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. అయితే జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..