Lok Sabha Election 2024 : పశ్చిమ బెంగాల్లో బిజెపి, టిఎంసి పరస్పర దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election 2024 : పశ్చిమ బెంగాల్లో నేడు (ఏప్రిల్ 19) ఓటింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్, అలీపుర్దువార్, జల్పైగురితో సహా మూడు ప్రధాన నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ సమయంలో కూచ్ బెహార్ నుండి హింస వార్తలు వెలుగులోకి వచ్చాయి. కూచ్ బెహార్లోని గిరియాకుతిలో పరిస్థితి మరింత దిగజారింది.. హింస కనిపించింది. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు బిజెపి, టిఎంసి పరస్పరం హింసకు సంబంధించి ఎన్నికల కమిషనర్కు పలు ఫిర్యాదులు చేశాయి. బిజెపి మద్దతుదారుల ఇళ్లను ధ్వంసం చేశారు. దీని కారణంగా బిజెపి మద్దతుదారులు తృణమూల్ కాంగ్రెస్ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అయితే దాడి ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది.
Read Also:G. Kishan Reddy: నన్ను గెలిపించండి.. సికింద్రాబాద్ ఎంపీగా మీ నమ్మకాన్ని నిలబెడుతాను..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఈ ఉదయం పోలింగ్ బూత్లు 226, 227కి చేరుకోవడానికి ముందు తృణమూల్ కార్యకర్తలపై తమ బూత్ ప్రెసిడెంట్ నేతృత్వంలోని బిజెపి గూండాలు హింసకు పాల్పడ్డారని టిఎంసి నాయకులు ఆరోపించారు. ప్రజల మద్దతు లేకపోవడంతో కలత చెందిన బిజెపి ఇప్పుడు హింసను ఆశ్రయించి మన ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుందని టిఎంసి ఆరోపించింది. మా గ్రామ పంచాయతీ సభ్యులను, బేగర్కట, బ్లాక్ నెం:-226లోని ప్రజలను గూండాలు వేధించి బెదిరించారని టీఎంసీ చెబుతోంది. మహిళా గ్రామ పంచాయతీ సభ్యురాలు ఓటు వేయకుండా బీజేపీ గూండాలు వేధించారని టీఎంసీ అంటోంది. ఇది వారి ప్రజాస్వామిక హక్కులను పూర్తిగా ఉల్లంఘించడమేనని ఎన్నికల కమీషనర్ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also:Lok Sabha Elections: చరిత్రలో తొలిసారి.. అతి తక్కువ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ..
పశ్చిమ బెంగాల్లోని మేదినీపూర్లో జరిగిన రాళ్లదాడి ఘటనపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద్ బోస్ స్పందించారు. శాంతి, సామరస్యాలను బెంగాల్ ప్రజలు కోరుకుంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. హింసకు పాల్పడే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం ఇది ఎన్నికల సంఘం బాధ్యత అన్నారు. దేశంలో ఈరోజు తొలి దశ ఎన్నికలు జరుగుతుండగా, 21 రాష్ట్రాల్లోని 102 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. అయితే జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!