Lok Sabha Election 2024 : పశ్చిమ బెంగాల్లో బిజెపి, టిఎంసి పరస్పర దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election 2024 : పశ్చిమ బెంగాల్లో నేడు (ఏప్రిల్ 19) ఓటింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్, అలీపుర్దువార్, జల్పైగురితో సహా మూడు ప్రధాన నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ సమయంలో కూచ్ బెహార్ నుండి హింస వార్తలు వెలుగులోకి వచ్చాయి. కూచ్ బెహార్లోని గిరియాకుతిలో పరిస్థితి మరింత దిగజారింది.. హింస కనిపించింది. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు బిజెపి, టిఎంసి పరస్పరం హింసకు సంబంధించి ఎన్నికల కమిషనర్కు పలు ఫిర్యాదులు చేశాయి. బిజెపి మద్దతుదారుల ఇళ్లను ధ్వంసం చేశారు. దీని కారణంగా బిజెపి మద్దతుదారులు తృణమూల్ కాంగ్రెస్ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అయితే దాడి ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది.
Read Also:G. Kishan Reddy: నన్ను గెలిపించండి.. సికింద్రాబాద్ ఎంపీగా మీ నమ్మకాన్ని నిలబెడుతాను..
Also Read
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
- CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
ఈ ఉదయం పోలింగ్ బూత్లు 226, 227కి చేరుకోవడానికి ముందు తృణమూల్ కార్యకర్తలపై తమ బూత్ ప్రెసిడెంట్ నేతృత్వంలోని బిజెపి గూండాలు హింసకు పాల్పడ్డారని టిఎంసి నాయకులు ఆరోపించారు. ప్రజల మద్దతు లేకపోవడంతో కలత చెందిన బిజెపి ఇప్పుడు హింసను ఆశ్రయించి మన ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుందని టిఎంసి ఆరోపించింది. మా గ్రామ పంచాయతీ సభ్యులను, బేగర్కట, బ్లాక్ నెం:-226లోని ప్రజలను గూండాలు వేధించి బెదిరించారని టీఎంసీ చెబుతోంది. మహిళా గ్రామ పంచాయతీ సభ్యురాలు ఓటు వేయకుండా బీజేపీ గూండాలు వేధించారని టీఎంసీ అంటోంది. ఇది వారి ప్రజాస్వామిక హక్కులను పూర్తిగా ఉల్లంఘించడమేనని ఎన్నికల కమీషనర్ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also:Lok Sabha Elections: చరిత్రలో తొలిసారి.. అతి తక్కువ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ..
పశ్చిమ బెంగాల్లోని మేదినీపూర్లో జరిగిన రాళ్లదాడి ఘటనపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద్ బోస్ స్పందించారు. శాంతి, సామరస్యాలను బెంగాల్ ప్రజలు కోరుకుంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. హింసకు పాల్పడే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం ఇది ఎన్నికల సంఘం బాధ్యత అన్నారు. దేశంలో ఈరోజు తొలి దశ ఎన్నికలు జరుగుతుండగా, 21 రాష్ట్రాల్లోని 102 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. అయితే జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
తాజావార్తలు
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!