Lok Sabha Election 2024 : పశ్చిమ బెంగాల్లో బిజెపి, టిఎంసి పరస్పర దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Election 2024 : పశ్చిమ బెంగాల్లో నేడు (ఏప్రిల్ 19) ఓటింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్, అలీపుర్దువార్, జల్పైగురితో సహా మూడు ప్రధాన నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ సమయంలో కూచ్ బెహార్ నుండి హింస వార్తలు వెలుగులోకి వచ్చాయి. కూచ్ బెహార్లోని గిరియాకుతిలో పరిస్థితి మరింత దిగజారింది.. హింస కనిపించింది. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు బిజెపి, టిఎంసి పరస్పరం హింసకు సంబంధించి ఎన్నికల కమిషనర్కు పలు ఫిర్యాదులు చేశాయి. బిజెపి మద్దతుదారుల ఇళ్లను ధ్వంసం చేశారు. దీని కారణంగా బిజెపి మద్దతుదారులు తృణమూల్ కాంగ్రెస్ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అయితే దాడి ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది.
Read Also:G. Kishan Reddy: నన్ను గెలిపించండి.. సికింద్రాబాద్ ఎంపీగా మీ నమ్మకాన్ని నిలబెడుతాను..
Also Read
- ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
- Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
- Bigg Boss 10 Contestants Remuneration: బిగ్బాస్ హౌస్లో రాంప్రసాద్కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
- Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
ఈ ఉదయం పోలింగ్ బూత్లు 226, 227కి చేరుకోవడానికి ముందు తృణమూల్ కార్యకర్తలపై తమ బూత్ ప్రెసిడెంట్ నేతృత్వంలోని బిజెపి గూండాలు హింసకు పాల్పడ్డారని టిఎంసి నాయకులు ఆరోపించారు. ప్రజల మద్దతు లేకపోవడంతో కలత చెందిన బిజెపి ఇప్పుడు హింసను ఆశ్రయించి మన ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుందని టిఎంసి ఆరోపించింది. మా గ్రామ పంచాయతీ సభ్యులను, బేగర్కట, బ్లాక్ నెం:-226లోని ప్రజలను గూండాలు వేధించి బెదిరించారని టీఎంసీ చెబుతోంది. మహిళా గ్రామ పంచాయతీ సభ్యురాలు ఓటు వేయకుండా బీజేపీ గూండాలు వేధించారని టీఎంసీ అంటోంది. ఇది వారి ప్రజాస్వామిక హక్కులను పూర్తిగా ఉల్లంఘించడమేనని ఎన్నికల కమీషనర్ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also:Lok Sabha Elections: చరిత్రలో తొలిసారి.. అతి తక్కువ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ..
పశ్చిమ బెంగాల్లోని మేదినీపూర్లో జరిగిన రాళ్లదాడి ఘటనపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద్ బోస్ స్పందించారు. శాంతి, సామరస్యాలను బెంగాల్ ప్రజలు కోరుకుంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. హింసకు పాల్పడే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం ఇది ఎన్నికల సంఘం బాధ్యత అన్నారు. దేశంలో ఈరోజు తొలి దశ ఎన్నికలు జరుగుతుండగా, 21 రాష్ట్రాల్లోని 102 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. అయితే జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
తాజావార్తలు
-
ISRO: ‘‘ఇస్రో ప్రైవేటీకరణ కాదు’’.. ఉద్యోగులకు చైర్మన్ భరోసా..
-
Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
-
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్బాస్ హౌస్లో రాంప్రసాద్కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
-
Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
-
Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్.. సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ మాస్ ఊచకోత !
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!