Minister Bala Veeranjaneya Swamy: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలి..
- అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలి
- ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం
- బోగస్ పింఛన్లకు అడ్డుకట్ట వేయాలి
- అర్హులైన చివరి వ్యక్తి వరకు పింఛను అందించాలి
- అధికారులకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Bala Veeranjaneya Swamy: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని, ప్రభుత్వ లక్ష్యసాధనకనుగుణంగా అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మంగళవారం నాడు వెలగపూడి సచివాలయంలో విభిన్న ప్రతిభావంతులు, వయో వయోవృద్దులు, ట్రాన్స్ జెండర్స్ సంక్షేమంపై అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరాలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్కు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
Read Also: AP Vision Document-2047: ఏడాదికి 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్..
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
- New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నారు. అంద విద్యార్థులకు ఒకేషనల్, స్కిల్ కోర్సులు కూడా ప్రవేశపెట్టాలన్నారు. పాఠశాలలు ప్రారంభించే సమయానికే వారికి పాఠ్య పుస్తకాలు అందించాలన్నారు. ట్రాన్స్ జెండర్లు గుర్తింపు కార్డులు తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ట్రాన్స్ జెండర్లకి ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ట్రాన్స్ జెండర్లతో స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు ప్రోత్సహించాలన్నారు. వారికి స్వయం ఉపాధి కల్పించి సమాజంలో గౌరవంగా బతికేలా చర్యలు చేపట్టాలన్నారు. దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిల్లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు.
దివ్యాంగులకు సేవ చేసే అదృష్టం రావడం గొప్ప భాగ్యమని.. అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పని చేయాలన్నారు. అధికారులు సంబంధిత శాఖలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు. జిల్లా కలెక్టరేట్లలో జరిగే గ్రీవెన్స్కి ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. బోగస్ సర్టిఫికెట్లతో పింఛన్ల పంపిణీకి అడ్డుకట్ట వేయాలన్నారు. ఆర్దిక ఇబ్బందులు ఉన్నా చెప్పిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన మొదటి నెల రూ.7000 పింఛన్ ఇచ్చామని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు పింఛన్లు అందించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమం, వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం సెక్రటరీ ఎ. సూర్య కుమారి, డిప్యూటీ డైరెక్టర్ డి.రవి ప్రకాష్ రెడ్డి, దివ్యాంగ కార్పొరేషన్ ఎండి ఎం.ఏ కుమార్ రాజా మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
-
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!