Kishan Reddy: విమోచన దినోత్సవ వేడుకలు జరపాలి.. కేసిఆర్ కు ఆహ్వానం పంపిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: విమోచన దినోత్సవం జరపకుండా రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేశారని కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాలను పురస్కరించుకుని కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం అరాచక పాలన నుంచి నాటి హైదరాబాద్ సంస్థానం విమోచన సందర్భంగా సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగరిందన్నారు. చరిత్రలో ప్రతీ ప్రత్యేక ఘట్టానికి ఉత్సాహంగా, పండగగా, వేడుకగా జరుపుకుంటాం.. కానీ తెలంగాణలో గత 75 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాలను అధికారికంగా జరపకపోవడం దురదృష్టకరమన్నారు. బీజేపీ గత 25 ఏళ్లుగా అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించాలంటూ పోరాటం చేస్తుందని తెలిపారు. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, నేటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదని అన్నారు.
కానీ బీజేపీ ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. గతేడాది సెప్టెంబర్ 17న ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ‘తెలంగాణ విమోచన ఉత్సవాలను’ నిర్వహించామన్నారు. 75 ఏళ్ల క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ త్రివర్ణ పతాకం ఎగరేస్తే.. 75 ఏళ్ల తర్వాత అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా చేతుల మీదుగా గతేడాది హైదరాబాద్ లో ఉత్సవాలు జరిగాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి బీఆర్ఎస్ పార్టీ.. చీము నెత్తురుంటే తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాలని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ అధికారం చేపట్టిన ఈ తొమ్మిదేండ్లలో ఎందుకు ఈ విమోచన ఉత్సవాలు జరపలేదు? అని ప్రశ్నించారు. ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? అని అడిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజంగా చీము, నెత్తురు ఉంటే ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని అన్నారు. మజ్లిస్ పార్టీని సంతృప్తి పరిచేందుకే ఇవాళ కేసీఆర్ ఈ ఉత్సవాలను నిర్వహించడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కలిసి.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను తప్పుదోవ పట్టించేప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు.
Also Read
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ఈ విషయాన్ని గమనించి.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్రం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంలో.. తెలంగాణ సమాజాన్ని కోరుతున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలను కోరుతున్నానని తెలిపారు. కేంద్రం అధీనంలో ఈ ఏడాది కూడా పరేడ్ గ్రౌండ్లో విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతాయని తెలిపారు. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీఅర్ఎస్ ప్రయత్నం చేస్తున్నయని తెలిపారు. ఆ రోజు రాజకీయ సభలకు ప్లాన్ చేసారని అన్నారు. అమిత్ షా పాల్గొనే కార్యక్రమాన్ని దెబ్బతీసే ప్రయత్నం బీఅర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. సెప్టెంబరు 17 సాయంత్రం రాష్ట్రపతి భవన్లో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. ఈ వేడుకలలో పోరాట యోధులకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందన్నారు. మీరు మీటింగులు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ సెప్టెంబర్ 17 నే ఎందుకు పెట్టుకున్నారు? అని ప్రశ్నించారు. గత ఏడాది కేంద్ర ఆధ్వర్యంలో జరిగిన విమోచన దినోత్సవ వేడుకలకు రాకుండా కేసీఆర్ డుమ్మా కొట్టారని తెలిపారు. ఈ ఏడాది కూడా కేసిఆర్ కు విమోచన దినోత్సవం వేడుకలకు ఆహ్వానం పంపిస్తామన్నారు. సీఎం విమోచన దినోత్సవం వేడుకకు రావాలని తెలిపారు.
Skin Health Tips: సబ్బు బదులు పౌడర్తో స్నానం.. చర్మం మెరిసిపోవడం ఖాయం
తాజావార్తలు
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
-
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
-
Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!