Kishan Reddy: విమోచన దినోత్సవ వేడుకలు జరపాలి.. కేసిఆర్ కు ఆహ్వానం పంపిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: విమోచన దినోత్సవం జరపకుండా రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేశారని కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాలను పురస్కరించుకుని కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం అరాచక పాలన నుంచి నాటి హైదరాబాద్ సంస్థానం విమోచన సందర్భంగా సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగరిందన్నారు. చరిత్రలో ప్రతీ ప్రత్యేక ఘట్టానికి ఉత్సాహంగా, పండగగా, వేడుకగా జరుపుకుంటాం.. కానీ తెలంగాణలో గత 75 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాలను అధికారికంగా జరపకపోవడం దురదృష్టకరమన్నారు. బీజేపీ గత 25 ఏళ్లుగా అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలను నిర్వహించాలంటూ పోరాటం చేస్తుందని తెలిపారు. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, నేటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదని అన్నారు.
కానీ బీజేపీ ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. గతేడాది సెప్టెంబర్ 17న ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ‘తెలంగాణ విమోచన ఉత్సవాలను’ నిర్వహించామన్నారు. 75 ఏళ్ల క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ త్రివర్ణ పతాకం ఎగరేస్తే.. 75 ఏళ్ల తర్వాత అభినవ సర్దార్ పటేల్ అమిత్ షా చేతుల మీదుగా గతేడాది హైదరాబాద్ లో ఉత్సవాలు జరిగాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి బీఆర్ఎస్ పార్టీ.. చీము నెత్తురుంటే తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించాలని అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ అధికారం చేపట్టిన ఈ తొమ్మిదేండ్లలో ఎందుకు ఈ విమోచన ఉత్సవాలు జరపలేదు? అని ప్రశ్నించారు. ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? అని అడిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నిజంగా చీము, నెత్తురు ఉంటే ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని అన్నారు. మజ్లిస్ పార్టీని సంతృప్తి పరిచేందుకే ఇవాళ కేసీఆర్ ఈ ఉత్సవాలను నిర్వహించడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కలిసి.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను తప్పుదోవ పట్టించేప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు.
Also Read
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
- Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
- Rohit Sharma Retirement: "దాంతో నాకేం సంబంధం".. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
ఈ విషయాన్ని గమనించి.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కేంద్రం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంలో.. తెలంగాణ సమాజాన్ని కోరుతున్నానని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలను కోరుతున్నానని తెలిపారు. కేంద్రం అధీనంలో ఈ ఏడాది కూడా పరేడ్ గ్రౌండ్లో విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతాయని తెలిపారు. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీఅర్ఎస్ ప్రయత్నం చేస్తున్నయని తెలిపారు. ఆ రోజు రాజకీయ సభలకు ప్లాన్ చేసారని అన్నారు. అమిత్ షా పాల్గొనే కార్యక్రమాన్ని దెబ్బతీసే ప్రయత్నం బీఅర్ఎస్ కాంగ్రెస్ చేస్తున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. సెప్టెంబరు 17 సాయంత్రం రాష్ట్రపతి భవన్లో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. ఈ వేడుకలలో పోరాట యోధులకు నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుందన్నారు. మీరు మీటింగులు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ సెప్టెంబర్ 17 నే ఎందుకు పెట్టుకున్నారు? అని ప్రశ్నించారు. గత ఏడాది కేంద్ర ఆధ్వర్యంలో జరిగిన విమోచన దినోత్సవ వేడుకలకు రాకుండా కేసీఆర్ డుమ్మా కొట్టారని తెలిపారు. ఈ ఏడాది కూడా కేసిఆర్ కు విమోచన దినోత్సవం వేడుకలకు ఆహ్వానం పంపిస్తామన్నారు. సీఎం విమోచన దినోత్సవం వేడుకకు రావాలని తెలిపారు.
Skin Health Tips: సబ్బు బదులు పౌడర్తో స్నానం.. చర్మం మెరిసిపోవడం ఖాయం
తాజావార్తలు
-
Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
-
Hero Surge S32: స్కూటర్ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
-
All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
-
Uttarakhand Rains: వర్షంలో విషాదం.. పైప్లో ఇరుక్కొని ఆరేళ్ల పిల్లాడు మరణం..
-
Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!