Sri Lanka: “భారత్ చేసిన ఆర్థిక సాయం వల్లే సంక్షోభం నుంచి కోలుకున్నాం”
- భారత్ కు కృతజ్ఞతలు తెలిపిన శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే
- క్లిష్టతరమైన ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక కోలుకున్నదని వెల్లడి
- భారతదేశం నుంచి అందుకున్న 3.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందుకు కారణమని వ్యాఖ్య
- కొలంబోలో జరిగిన 31వ అఖిల భారత భాగస్వామ్య సమావేశంలో మాట్లాడిన అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక భారత్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. రెండు సంవత్సరాల క్లిష్టతరమైన ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక కోలుకున్నదని, భారతదేశం నుంచి అందుకున్న 3.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం వల్ల ఇది సాధ్యమైందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శనివారం అన్నారు. ఇదంతా తిరిగి చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. భారత్తో బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు తన నిబద్ధతను విక్రమసింఘే నొక్కి చెప్పారు. కొలంబోలో జరిగిన 31వ అఖిల భారత భాగస్వామ్య సమావేశాన్ని ఉద్దేశించి విక్రమసింఘే మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోడీతో భాగస్వామ్యానికి సంబంధించిన కీలక రంగాలను హైలైట్ చేశానని చెప్పారు. రెండు దేశాలు సంయుక్తంగా పని చేసే ముఖ్యమైన రంగాలలో పర్యావరణ అనుకూల ఇంధనం ఒకటని విక్రమసింఘే తెలిపారు. శ్రీలంక పలు ప్రతిపాదనలపై మోడీతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
READ MORE: Chirala: ఈపూరుపాలెం యువతి హత్య కేసును 48 గంటల్లోపే ఛేదించిన పోలీసులు
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “శ్రీలంక – భారతదేశం మధ్య గ్రిడ్ ఇంటర్కనెక్షన్ ద్వారా పర్యావరణ అనుకూల శక్తిని భారతదేశానికి పంపవచ్చు. మాకు సాంపూర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. ఇది అంతర్ ప్రభుత్వ ప్రాజెక్ట్. మూడు ద్వీపాల ప్రాజెక్ట్.. ఇక్కడ జూలైలో పునాది రాయి వేయాలని మేము ఆశిస్తున్నాము.” అని పేర్కొన్నారు. శ్రీలంక అధ్యక్షుడి ఈ ప్రకటన చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్కు అసంతృప్తి కలిగించవచ్చు. ఎందుకంటే అతను ఈ దేశంలో కూడా భారతదేశానికి వ్యతిరేకంగా తన స్థానాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!